ఏపీ సీఐడి ఏజీడీ సునీల్కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ఐ జోషి . ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్గా మతం మార్చుకున్న సునీల్కుమార్ను సర్వీస్ నుంచి తప్పించాలి . మతం మార్చుకున్న వారు రిజర్వేషన్ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్కుమార్ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి . సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో …
Read More »సుప్రీం కోర్టుకు RRR
బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
Read More »రూ.6 కోట్ల 75 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది. టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.
Read More »సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు
ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »వైసీపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు ఆయన మృతి తీరనిలోటని అభిప్రాయపడ్డారు . ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి …
Read More »పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్పై చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు పరిటాల శ్రీరామ్ ముష్టికోవెల గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో తనపై దాడి చేశారంటూ ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బత్తిన వెంకటరాముడు వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్తో పాటు ముష్టికోవెల …
Read More »చంద్రబాబు హత్యకు కుట్ర..?
ఏపీ మాజీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 150 మంది ఎమ్మెల్యేలున్నా జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని …
Read More »గ్రామవాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గ్రామవాలంటీర్లకు శుభవార్తను తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామ/వార్డు వాలంటీర్లను సత్కరించనున్నది వైసీపీ ప్రభుత్వం.. ఇందుకోసం వాలంటీర్లను 3 కేటగిరీలు మార్చింది. లెవల్-1 కింద ఏడాది సేవలందించిన వారికి సేవామిత్ర కింద బ్యా డ్లీ, రూ.10వేలు, లెవల్-2 కింద ప్రతి మండలం/పట్టణంలో ఐదుగుర్ని ఎంపిక చేసి వారికి సేవారత్న కింద బ్యా డీ, రూ.20వేలు, లెవల్-3లో ప్రతి నియోజకవర్గంలో …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సీఎం, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాకో PS ఏర్పాటు చేసి… వ్యవసాయ అంశాల్లో మోసాలు జరిగితే రైతుల అండగా నిలిచేలా చూడాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను, న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించడానికి ఈ పోలీసు స్టేషన్లు ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. రైతుల కోసం స్పెషల్ డెస్క్ …
Read More »