సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 202 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46), మయాంక్ (26), విహారి (20) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 4, ఒలీవియర్, రబాడా చెరో 3 వికెట్లు తీశారు. చివర్లో అశ్విన్ పోరాటంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.
Read More »రికార్డుకు చేరువలో కోహ్లీ
టీమిండియా పరుగుల యంత్రం…విరాట్ కోహ్లి ఇప్పటికి 98 టెస్టులు ఆడాడు. వెన్నునొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఆ దేశంలో మూడో టెస్టు ఆడితే 99 మ్యాచ్ లు పూర్తవుతాయి. స్వదేశంలో శ్రీలంకతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగే మ్యాచ్లో కోహ్లికి వంద మ్యాచ్ లు పూర్తవుతాయి. అదే స్టేడియంలో 360 డిగ్రీస్ ఆటగాడు డివిలియర్స్ కూడా వందో టెస్టు ఆడాడు. ఇద్దరూ కూడా IPLలో బెంగళూరుకే …
Read More »జొహానెస్ బర్గ్ లో టీమిండియాకు మంచి రికార్డు
ఇటీవల జరిగిన సెంచూరియన్ లో టెస్ట్ మ్యాచు గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో కోహ్లి సేన రెండో టెస్టులో సౌతాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. టీమ్ ఇండియాకు మంచి రికార్డున్న జొహానెస్ బర్గ్ వేదికగా మ్యాచ్ మ.1.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా.. దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రోటీస్ చూస్తోంది. అయితే.. ఈ మ్యాచిక్కి వర్షం వల్ల …
Read More »వైస్ కెప్టెన్ గా బుమ్రా
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తారని అస్సలు ఊహించలేదని భారత మాజీ సెలెక్టర్, వికెట్ కీపర్ సబా కరీమ్ అన్నాడు. ‘ఈ విషయం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాను. అతడు మల్టీ ఫార్మాట్ ప్లేయర్. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ అద్భుతంగా రాణించాడు. పంత్కి కెప్టెన్సీపై అవగాహన ఉంది’ అని కరీమ్ …
Read More »భారత్ 174 రన్స్ కి ఆలౌట్
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు 2వ ఇన్నింగ్సులో భారత్ 174 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. పంత్ (34), KL రాహుల్(23), రహానే (18) తప్ప మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, మార్కో చెరు 4 వికెట్లు తీయగా.. ఎంగిడికి 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ 304 రన్స్ ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్లో గెలవాలంటే సౌతాఫ్రికా 305 …
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లి.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్ టాప్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న 29 సార్ల టాస్ రికార్డును కోహ్లి అధిగమించాడు. కాగా కోహ్లి టాస్ నెగ్గిన 3 30 …
Read More »కపిల్ దేవ్ రికార్డుపై రవిచంద్రన్ అశ్విన్ గురి
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.
Read More »Cricket బెట్టింగ్ ని చట్టబద్ధం చేయాలి- రవిశాస్త్రి
పన్ను పరంగా చూస్తే బెట్టింగ్.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందని, భారతదేశంలో బెట్టింగ్ ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక మీడియా కార్యక్రమంలో బెట్టింగ్ పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగాన్ని ఎంతగా అణచివేయాలని చూసినా కుదరదని అన్నాడు. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న మార్గమిదే అని రవిశాస్త్రి చెప్పాడు.
Read More »ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్ను
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్నేశాడు. సౌతాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 22 ఇన్నింగ్స్లో 624 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాలో కోహ్లి 10 ఇన్నింగ్స్లో 558 పరుగులు చేశాడు. ద్రవిడ్ రికార్డును అధిగమించేందుకు కోహ్లి మరో 66 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక సౌతాఫ్రికాలో సచిన్ 1161 పరుగులతో టాప్లో …
Read More »వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments
టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.
Read More »