దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి క్షేత్రం ఖ్యాతి దేదీప్యమానంగా వెలిగిపోయింది. వైయస్ టీటీడీలో పలు సంస్కరణలు చేపట్టి…తిరుమల రూపురేఖలు పూర్తిగా మార్చి వేశారు. అర్చకులకు వేతన వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా వైయస్ హయాంలోనే కావడం విశేషం. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఎందుకనో హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత కనపరుస్తారు. ఆధ్యాత్మిక , దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చెప్పులు వేసుకుని …
Read More »చంద్రబాబు హయాంలో ఢిల్లీ లోకల్ అడ్వైజర్ కమిటీ అక్రమాలకు పాల్పడింది.. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం
తిరుమలకు వెళ్లే బస్ టికెట్ల వెనుక ముస్లింలకు, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంతో భారీగా సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ నెటిజన్లు వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే అలాంటి ప్రచారం చేస్తున్న వారి పరిస్థితి ఎదురు తిరిగింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధమే లేదని తేలిపోయింది. ఈ వ్యవహారమంతా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. విషయంలోకి వెళ్తే తిరుమలకు వెళ్లే …
Read More »హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలు లేవు.. ఇంకా ఆయన అనుకూలస్తులు ఆర్టీసీలో ఉన్నారా?
తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతం గొడవపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని జరుగుతున్న వ్యవహారం తమ దృష్టికి వచ్చినవెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టిక్కెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందన్నారు. ఇవన్నీ నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లని, కానీ నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. …
Read More »చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం.. సాక్ష్యాలు బయటపెట్టిన మల్లాది విష్ణు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం జరిగిందని విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలోనే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని గుర్తుచేశారు. తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై మల్లాది విష్ణు స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం..!
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర …
Read More »దిగివచ్చిన టీవీ5.. పొరపాటుకు చింతిస్తున్నామంటూ వివరణ
టీటీడీలో క్రిష్టోఫర్ నియామకం అంటూ తాము ప్రచురించిన వార్త తప్పు అని TV5 వివరణ ఇచ్చింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ అనే వ్యక్తిని నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించింది. ఇలాంటి అసత్య వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఆగ్రహించారు. ఈ క్రమంలో దరువు కూడా వరుస …
Read More »సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్
తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై సిఫార్సు లేఖ లేకుండానే… సామాన్య భక్తులు సైతం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు సామాన్య భక్తులకు కేటాయించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు… వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం …
Read More »ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించున్న పృథ్వీ
ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా …
Read More »టీటీడీకీ కోటి విరాళం ఇచ్చిన డల్లాస్ ఎన్నారై…దరువు ఎండీ కరణ్ రెడ్డితో కలిసి చెక్ అందజేత..!
తిరుమల తిరుపతి దేవాలయానికి డల్లాస్ ఎన్నారై జాస్తి సాంబశివ రావు ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సతీసమేతంగా కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ అందజేశారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఈ ఐదేళ్లకు కోటి చెప్పున మొత్తం రూ. 5 కోట్లు ఇస్తానని ఈ సందర్భంగా శివ వైవీ సుబ్బారెడ్డికి తెలిపారు. ఇలా భక్తులు టీటీడీకి దానం చేయడం …
Read More »ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులవేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ దర్శనాల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. శ్రీవారిని దర్శించుకునే విషయంలో భాగంగా L1, L2, L3, దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. …
Read More »