ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించ నున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు సంబంధించిన సిబ్బంది నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో 60 రకాల పరీక్షల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు …
Read More »ప్రజారోగ్యపరిరక్షణ లో తెలంగాణ టాప్
ప్రజారోగ్య పరిరక్షణ లో తెలంగాణా ప్రభుత్వం సత్ఫాలితలు సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మెడీకల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని బుధవారం రోజున ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »డిమాండ్ ఉన్న పంటలకే ప్రాధాన్యత-మంత్రి జగదీష్
డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా యావత్ రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోవొచ్చని ఆయన పేర్కొన్నారు. వానాకాలం పంటలపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్,స్థానిక శాసనసభ్యులు …
Read More »అంజయ్య కుటుంబానికి అండగా ఉంటా-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కలిశారు. అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్గా అంజయ్య తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని కేటీఆర్ కొనియాడారు. అంజయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అన్ని …
Read More »మంత్రి హారీష్ అధ్యక్షతన వైద్యారోగ్య సబ్ కమిటీ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, పీ సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు, పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర …
Read More »సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని …
Read More »తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ కీలక నిర్ణయాలు ….. రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి …
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వ ద్యేయం- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తెలంగాణలో హైద్రాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కేంద్రాలను ( డయాగ్నస్టిక్ సెంటర్లు) ఈనెల 9వ తేదిన ప్రారంభించబడతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు పరీక్ష చేసి మందులు …
Read More »కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.
Read More »తెలంగాణలో మరో 10రోజులు లాక్డౌన్
తెలంగాణలో లాక్డౌన్ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి.. నకిరేకల్ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ప్రస్తుత లాక్డౌన్ స్థితి కొనసాగింపు
Read More »