Home / Tag Archives: trsgovernament (page 239)

Tag Archives: trsgovernament

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

 తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ప్ర‌భుత్వ, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగుల‌తో పాటు వారి మీద ఆధార‌ప‌డ్డ వారు.. ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో ఇన్‌పెషేంట్ వార్డుల్లో కొవిడ్ చికిత్స పొందితే వారికి మెడిక‌ల్ రీఎంబ‌ర్స్‌మెంట్ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు ఆరోగ్య శాఖ సెక్ర‌ట‌రీ ఎస్ఏఎమ్ రిజ్వీ తెలిపారు. రూ. ల‌క్ష వ‌ర‌కు రీఎంబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ఎమ‌ర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన వారికే రీఎంబ‌ర్స్‌మెంట్ వ‌ర్తించ‌నుంది.

Read More »

తెలంగాణ ఆర్టీసీ కార్గో,పార్సిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ

టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శివ మానస పుత్రికగా దిన దినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనటం సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. సరికొత్త ఆశయం, ఆకాంక్షలతో టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల్ని ప్రారంభించి జూన్ 19 నాటికి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఉద్యోగుల నుంచి …

Read More »

మాజీ మంత్రి ఈటెల డొల్ల‌త‌నాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన మంత్రి గంగుల

మాజీ మంత్రి క‌భ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజెంద‌ర్ పై రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువ‌త చేరిన కార్య‌క్ర‌మంలో గంగుల క‌మ‌లాక‌ర్ పాల్గొని వారికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ తెలంగాణ‌ను ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపిస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప వ్య‌క్తిని ఇష్టానుసారంగా అనుచిత వాఖ్య‌లు …

Read More »

ఈ నెల 22న వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్

ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్ వెళ్ల‌నున్నారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను ప‌రిశీలించారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. గ‌తేడాది న‌వంబ‌ర్ నెల‌లో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికుల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే.

Read More »

లేక్ వ్యూ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హుస్సేన్ సాగ‌ర్ స‌మీపంలో నిర్మించిన 330 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ల‌బ్దిదారుల‌కు త్వ‌ర‌లోనే అంద‌జేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మురికివాడ‌గా ఉన్న ఏరియాను అభివృద్ధి చేసి, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించ‌డంపై …

Read More »

రేష‌న్ కార్డుల జారీ, ధాన్యం సేక‌ర‌ణపై మంత్రి గంగుల విడియో కాన్ప‌రెన్స్

నూత‌న రేష‌న్ కార్డుల జారీ, ధాన్యం సేక‌ర‌ణ అంశాల‌పై రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మలాక‌ర్ క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ నుండి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, డిఎంలు, డిఎస్వోల‌తో విడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు. పౌర‌స‌ర‌ఫ‌రాల కార్యాల‌యం నుండి క‌మిష‌నర్ అనిల్ కుమార్ ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్న ఈ స‌మావేశంలో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ రేష‌న్ కార్డుల జారీపై కాబినెట్ స‌బ్ క‌మిటీ సూచించిన విదంగా పెండిగ్లో …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp వివేకానంద్ కృషి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గారిని కలిసేందుకు వివిధ ప్రాంతాల నుండి కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే …

Read More »

ఏడో విడత హరితహారానికి సిద్ధం

ఏడవ విడత హరిత హారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవు తోంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేయనున్నారు. వర్షాల జోరు మరింత పుంజుకోగానే జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని అట్టహా సంగా ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాటు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దఎత్తున నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర …

Read More »

విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?

వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్‌ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీటివసతి కల్పించడం లక్ష్యంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును, అనుబంధ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మింపజేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఎంత విలవిలలాడిందో గమనించిన వారికి మన రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిందేమిటో అర్థమవుతుంది. …

Read More »

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు- మారెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేక‌ర‌ణ పూర్తి అయిన‌ట్లు తెలంగాణ‌ పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్ మారెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు. వానాకాలం, యాసంగిలో క‌లిపి కోటి 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోళ్లు చేసిన‌ట్లు చెప్పారు. ఒక్క యాసంగి సీజ‌న్‌లోనే 90 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల కొనుగోళ్లు జ‌రిగిన‌ట్లు తెలిపారు. మ‌రో 50 వేల నుంచి ల‌క్ష మెట్రిక్ ట‌న్నులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇప్ప‌టికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat