తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కవర్ సర్వీసుల ద్వారా హోం డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఖమ్మం ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 19న మంత్రి పువ్వాడ ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు కార్గో సేవలు మరింత చేరువయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో …
Read More »లాడ్జి అంటే.. చెప్పుతో కొడ్తా
లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్కుమార్పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది. ‘న్యూస్లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్ పెట్టిన. …
Read More »రెండున్నర గంటలు.. 4.5 కిలోమీటర్ల నడక
వాసాలమర్రి గ్రామంలో మీదివాడ, కిందివాడ పేరుతో రెండు ఎస్సీవాడలున్నాయి. మొత్తం 76 కుటుంబాలు ఉన్నాయి. మీదివాడ.. ఊరికి తూర్పువైపున, కిందివాడ ఊరికి పడమర దిక్కు ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల సీసీరోడ్లు ఉండగా, మరికొన్ని గల్లీల్లో మట్టిరోడ్లు మాత్రమే ఉన్నాయి. సీఎం కేసీఆర్ తన పర్యటనను కిందివాడ నుంచి ప్రారంభించారు. మీదివాడను, కిందివాడను అనుసంధానం చేసే సీసీరోడ్డు మీదుగా సీఎం పర్యటిస్తారని అధికారులు భావించారు. కానీ వారి అంచనాకు భిన్నంగా …
Read More »గంటకు పైగా దళితవాడలో పర్యటించిన సీఎం కేసీఆర్
దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. సుమారు గంటకు పైగా దళితవాడలో సీఎం పర్యటించారు. దళిత వాడలోని 60 కుటుంబాలను సీఎం కేసీఆర్ పలుకరించి.. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై గ్రామస్థులతో చర్చించారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా …
Read More »ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : మంత్రి కేటీఆర్
తెలంగాణలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులను కలిగిన అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. వారికి తప్పకుండా పార్టీ అండగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వివిధ ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భవన్లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 …
Read More »కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దు- మంత్రి నిరంజన్రెడ్డి
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వనపర్తిలోని తన నివాసంలో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాసాలమర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత దళిత వాడలో పర్యటిస్తున్నారు. ఆ వాడలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్.. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దళితుల స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు. దళితవాడలో పర్యటన ముగిసిన అనంతరం.. గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను …
Read More »తీన్మార్ మల్లన్నకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు
తీన్మార్ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్ 197/2021లో ఐపీసీ సెక్షన్ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్పీసీ సెక్షన్ …
Read More »రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది. సీఎం గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో …
Read More »సీఎం చేతుల మీదుగా 57 ఏండ్ల పెన్షన్లు ప్రారంభిస్తాం
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్లందరికి పెన్షన్లు అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000 మందికి ప్రతి నెలా రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని మంత్రి తెలిపారు.ఈ మేరకు తమ శాఖ అధికారులు …
Read More »