తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాలను మంత్రి గంగుల కమలాకర్తో కలసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు.
Read More »శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Read More »తెలంగాణలో వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84%) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75%) కంటే ఇది దాదాపు 12% అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 2.20 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్, మేడ్చల్ …
Read More »నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్
సర్కారు కొలువుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపు లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీకి శాసనసభలో సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల …
Read More »వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ గారు ఆవిష్కరించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ను కేసీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములుతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని టీఆర్ఎస్ …
Read More »Telangana Assembly- సభ్యులు సెషన్ మొత్తం సస్పెండ్ అవ్వడం ఇది ఎన్ని సార్లు .అవునా.. కాదా..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని రఘునందన్ రావు సభలో ప్రసంగానికి అడ్డు తగలడం మొదలెట్టారు.దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ సెషన్ ముగిసేవరకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అసెంబ్లీలో …
Read More »తొలి మహిళా ఎస్ హెచ్ వోగా మధులత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్హెచ్ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్స్పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు.మధులత 2002 బ్యాచ్ కు …
Read More »Telangana Assembly Budget Meetings-బీజేపీ ఎమ్మెల్యేలపై వేటుకు అదే కారణమా..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖమంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో … మరోక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అయితే శాసనసభలో మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని …
Read More »మంత్రి సత్యవతి రాథోడ్ ను కల్సిన ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం
మహిళల గౌరవం కాపాడే విధంగా మరిన్ని చట్టాలను తీసుకురావాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం నేడు మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి విజ్ణప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి, కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, …
Read More »2 గంటల పాటు కొనసాగిన మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్రావు తన ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను హరీశ్రావు వివరంగా చదివి వినిపించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని …
Read More »