తెలంగాణ రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రూప్ 1 కింద 503 పోస్టులకు, పోలీస్, రవాణా, అటవీ, ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. తాజా అనుమతులతో మొత్తం పోస్టుల …
Read More »రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలి
ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఉత్పత్తి రంగం బలోపేతానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. కేంద్రం మంచి పని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం అని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయ వ్యూహాలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవల్ప్మెంట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని 1433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయగా, మిగిలిన 80,039 …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వీధి ద్వీపాలు, పారిశుధ్య నిర్వహణ, పార్క్ అభివృద్ధి, మిగిలిన భూగర్భడ్రైనేజీలను పూర్తి చేయాలని కొరారు. .. ఎమ్మెల్యే గారు అక్కడే …
Read More »BJP ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు..
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేత… దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ మహానగరంలోని అబిడ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన …
Read More »BJP ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి చెందిన నేత.. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్పై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంచన్బాగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ధేశ్యపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టాలనే అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. ఈ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp ప్రత్యేక దృష్టి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదే విధంగా తమ సమస్యలు పరిష్కరించినందుకు గాను ఎమ్మెల్యే గారిని …
Read More »బీజేపీపై మంత్రి హరీష్ రావు ఫైర్
‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది. ‘తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షలకుపైగా కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాం’ అని కేంద్ర …
Read More »తెలంగాణలో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని.. గ్రామాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీసును కౌంట్ చేస్తూ, పీజీ అడ్మిషన్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
Read More »సర్కారు బడుల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.500
తెలంగాణలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (మ) సర్పంచ్ శారదా ప్రవీణ్.. సర్కారు బడులను బలోపేతం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సర్కారు బడిలో చేరే పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గ్రామస్తులు సర్పంచ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
Read More »