తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More »కవులు,రచయితలను గుర్తించిందే సీఎం కేసీఆర్
కవులు, రచయితలను గుర్తించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ఒక్కరికే దక్కుతుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. 25 ఏండ్లలో కవులను, రచయితలను ఎవరూ గుర్తించలేదని, తన పాట, కవిత, రచనలను గుర్తించి ముఖ్యమంత్రి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పారు. హైదరాబాద్లోని మలక్పేట ‘బీ’ బ్లాక్ ముంతాజ్ కళాశాలలో ప్రిన్సిపాల్, కవి యాకూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2020 (షేక్ మహమ్మద్ మియా, కేఎల్ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా …
Read More »ఖమ్మం గడ్డ టీఆర్ఎస్ అడ్డా-రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేష్ చౌదరి
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియా యాక్టివ్ కార్యకర్తల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి పార్టీ ఆఫీసు ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళి,నగర సోషల్ మీడియా కన్వీనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేశ్ చౌదరి మాట్లాడుతూ “తెలంగాణ ఏర్పడిన అన్ని …
Read More »బీజేపీ నేతలపై మంత్రి వేముల ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు స్థాయికి మించి సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. …
Read More »మంత్రి కేటీఆర్ కి వృక్ష వేదం పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నేడు అందజేయడం జరిగింది. ఈ …
Read More »ఘనంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివాహా ఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించారు. సోమవారం వరుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్రెడ్డి వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు వరుడి బంధువులు ఏర్పాట్ల పర్యవేక్షణలో …
Read More »జనవరి 13నుండి ఐనవోలు జాతర
ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. ఈ జాతరకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి లత గౌడ్
రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నటుతున్నరు తాజాగా గౌడ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటి బత్తిని లత గౌడ్ గారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు ..అనంతరం తాను …
Read More »మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత
నిత్యం గీతా పఠనం చేయడం ద్వారా జీవితంలో సన్మార్గంలో పయనిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ‘గీతాజయంతి మహోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు. భగవద్గీతలోని ఎన్నో సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా …
Read More »