హైదరాబాద్లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు. పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు …
Read More »జీహెచ్ఎంసీలో బీజేపీకి బిగ్ షాక్..
హైదరాబాద్లో మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, అడిక్మెట్ …
Read More »ఆ టూరిస్టులు వస్తారు.. రెండు రోజులు లొల్లి పెట్టి పోతారు: కేటీఆర్
తెలంగాణకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. 8 ఏళ్ల కేసీఆర్, మోడీ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. కల్వకుర్తికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. రెండు రోజులు లొల్లి పెట్టి వెళ్లిపోతారని బీజేపీ జాతీయ …
Read More »రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు: నిరంజన్రెడ్డి
అర్హులైన లబ్ధిదారులందరికీ ‘రైతుబంధు’ కింద ఆర్థికసాయం జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఎక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందనేది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. రైతుబంధుపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదో విడత రైతుబంధు కింద రూ.7,508కోట్లు అందిస్తున్నామని మంత్రి …
Read More »కొల్లాపూర్లో సై అంటే సై.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
కొల్లపూర్కి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొల్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లపూర్నియోజకవర్గంలో టీఆర్ఎస్పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కాగా.. మరొకటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిది. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్లాపూర్ అభివృద్ధిపై …
Read More »దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు: కేటీఆర్
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 8 ఏళ్లలో హైదరాబాద్లో 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మరో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సూచిక ప్రజా రవాణా, రహదారులేనని చెప్పారు. కూకట్పల్లిలోని కైతలాపూర్ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. …
Read More »కేసీఆర్ సీఎం అయ్యాకే రైతులకు గౌరవం: హరీష్రావు
కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …
Read More »రూ.40వేల కోట్ల భూములు.. మాకు అప్పగించేయండి: కేటీఆర్
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీలను అమలు చేయడం లేదని టీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా విక్రయిస్తోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ …
Read More »ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్రావు
‘అగ్నిపథ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోతెలో పీహెచ్సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్లో జరిగిన అల్లర్లను టీఆర్ఎస్ చేయించిందంటూ బండి సంజయ్చేసిన ఆరోపణలపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో టీఆర్ఎస్ చేయిస్తే యూపీలో పోలీస్స్టేషన్పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …
Read More »సంజయ్లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్రెడ్డి
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటనల వెనుక టీఆర్ఎస్ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన …
Read More »