ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరుతోంది.వారి కష్టాలు తొలగి పోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం లభించడంతో వారు త్వరలో స్వరాష్ట్రం తెలంగాణకు చేరను న్నారు.ప్రాంత ఉద్యోగులను తెలంగాణకు రప్పించే కసరత్తు వేగవంతమైంది.ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు తెలంగాణ సీఎస్ సోమేష్కుమార్ లేఖ రాసి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపించాలని కోరారు.ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎస్ ఉద్యోగుల తిరిగి పంపించే అంశంపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.తెలంగాణ …
Read More »ఖమ్మంలో రెండో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ఖమ్మం జిల్లాలో రెండో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.36కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో టవర్ను నిర్మించనున్నారు. ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కృషితో తాజాగా …
Read More »కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం
తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని ఆరుగురు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల విద్యార్థినులకూ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. కానీ విద్యార్థినుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More »తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు గత ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్’ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా, ‘నల్లగొండ’ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల …
Read More »దివంగత ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ నివాళి
తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ …
Read More »అద్భుత రికార్డు.. చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం
తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే నీటి పంపింగ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్యశ్యామంగా మారుతున్నాయి. * చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంగా రికార్డు నెలకొల్పింది. మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి …
Read More »మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన తన నియోజకవర్గ కేంద్రం ధర్మపురి కేంద్రానికి చెందిన దేవి శంకర్ చికిత్స కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ప్రభుత్వం నుంచి 3లక్షల రూపాయలు మంజూరు చేయించారు.ఇందుకు సంబంధించిన LOC పత్రాన్ని శంకర్ భార్య దేవి అంజలి చేతికి మంత్రి అందించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా బాధపడుతున్న శంకర్ శనివారం నిమ్స్ లో చేరారు. విషయం తెలుసుకున్న కొప్పుల వెంటనే …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగం ప్రారంభించారు. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ(సభా వ్యవహారాల సంఘం) సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
Read More »ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలోమంత్రి కేటీఆర్ ఓటేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటేశాను. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి మద్దతుగా నిలిచాను. విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ …
Read More »టీఆర్ఎస్ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజు మంత్రి కేటీఆర్ “సర్ ప్రైజ్ గిఫ్ట్”
కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్ లోనే ఉంటూ …
Read More »