కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతమంటూ గ్రామ మహిళా సమాఖ్య సంఘ మహిళలు ముందుకొచ్చారని చిన్నకోడూర్ మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామైక్య మహిళా సంఘ సమాఖ్య మహిళా ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఈ మేరకు తమ వంతు సాయంగా సీఏం సహాయ నిధికి విరాళంగా రూ.10వేల రూపాయల చెక్కును మంత్రి స్వీకరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని …
Read More »గత మార్చి బిల్లు కట్టండి చాలు
కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెల ఆన్లైన్ ద్వారా కడితే సరిపోతుందని కస్టమర్లకు తెలియజేసింది. గత మార్చి బిల్లు వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్ఎంఎస్ల ద్వారా కస్టమర్లకు పంపిస్తాయని, దాని ప్రకారం ఆన్లైన్లో బిల్లు చెల్లిస్తే చాలని టీఎస్ఈఆర్సీ తెలిపింది. లాక్ …
Read More »లాక్ డౌన్ ఒక్కటే మార్గం
వైరస్ వ్యాప్తిని నిరోధించడంతోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మూడు దశల్లో కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగాఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు. జూన్ మొదటివారానికి దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వెల్లడవుతున్న పలు నివేదికల …
Read More »వైద్యుడికి అండగా
రాష్ట్రంలో కరోనావ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదులకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యంచేస్తామని, వ్యాధి సోకినవారిని కలిసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రాష్టంలో లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి …
Read More »తెలంగాణలో కరోనా కట్టడికి రూ.370కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులను తగ్గించిన కానీ ఢిల్లీ ప్రభావంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి రూ .370కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పాలనాపరమైన అనునతులు ఇస్తూ ఆదేశాలను సైతం జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శికి వెసులుబాటు కల్పించింది.ఆయా శాఖల …
Read More »తెలంగాణలో మరో 12కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. నిన్న బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో పన్నెండు కేసులు నమోదయ్యాయి అని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎనబై ఎనిమిది కేసులు ఉండగా వీరికి చికిత్సను అందిస్తున్నారు.అయితే బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఒకరు కరోనా వైరస్ తో మృతి చెందారు.
Read More »వైద్యులకు,పోలీసులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు,ఇతర మెడికల్ నాన్ మెడికల్ సిబ్బందికి,పోలీసులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తను తెలిపారు.గత నెల రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విధితమే.ఇప్పటివరకు గురువారం ఉదయం వరకు మొత్తం 127కేసులు నమోదు కాగా ఇందులో తొమ్మిది మంది మృత్యు వాత పడ్డారు. అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్న వైద్యులు,మెడికల్,నాన్ మెడికల్ సిబ్బందికి,లాక్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా …
Read More »కరోనాను నివారిద్దాం
ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసాబ్ట్యాంక్లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి మంత్రి తలసాని బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ఆమలు చేస్తున్న కార్యక్రమాల ఆమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి …
Read More »అన్నార్తులకు అండగా..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గుజరాతీ, మర్యాడీ, వైశ్య సేవా సంస్థలు తమ వంతుగా సామాజిక ధృక్పథాన్ని చాటారు. సికింద్రాబాద్లోని గుజరాతీ సేవా మండల్, కాచిగూడలోని వైశ్య హాస్టల్, బేగంబజార్లోని మర్వాడీ సమాజ్, లక్డీకపూల్లోని వాసవి సేవా కేంద్రం ఒక్కొక్కరై ఐదు వేల మందికి చొప్పున రోజుకు ఇరవై వేల మంది నిరుపేదలకు వచ్చే నెల రోజుల పాటు భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. గుజరాతీ సేవా …
Read More »77కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు : ఈటల
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 77కు చేరుకుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా తాజా పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మత ప్రార్థనలకు హాజరై రాష్ర్టానికి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి బంధువుల్లో 15 మందికి కరోనా పాజిటివ్గా తేలిందన్నారు. కరోనా వైరస్ లక్షణాలు …
Read More »