తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరందుకుంటున్నది. ధరణి పోర్టల్కు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కేవలం 10 రోజుల్లోనే 12,705 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 8,488 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కాగా, బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 12,705కు చేరుకున్నది. అంటే రెండ్రోజుల్లోనే 4,217 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడ్రోజులుగా సగటున రెండువేలకు మించి రిజిస్ట్రేషన్లు, …
Read More »మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు
మాసాయి పేట వద్ద జాతీయ రహదారి వద్ద ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ..బైక్ స్క్రిడ్ అయి కింద పడ్డారు.. ఈ సమయంలో దౌల్తాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు గారు కింద పడిపోయిన ఇద్దరి యువకులను గమనించి కారులో ఆపి దిగారు… జరిగిన సంఘటనను అడిగి తెలుసుకొని.వారికి గాయాలను గుర్తించి అక్కడ ఉన్న ఎస్ ఐ గారి కి చెప్పి ఆసుపత్రి చేపించారు.. ఇద్దరి …
Read More »ఆరేండ్లలో 28 వేల పోలీసు నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఆరేండ్లలో దాదాపు 28వేల మంది పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని.. సాంకేతికత, ఫ్రెండ్లీ పోలీసీంగ్తో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజాభద్రత, రక్షణకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్.. పోలీసుశాఖకు అనేక వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్లో ఏర్పాటుచేసిన …
Read More »దక్షిణకొరియా కంపెనీలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం
తెలంగాణలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకు రావాలన్నారు. ఈ పార్క్లో సకల సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. భారత్-కొరియా బిజినెస్ ఫోరం బుధవారం ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎ్సఐపాస్ విధానం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిందని గుర్తుచేశారు. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్ రావు
దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు ప్రజా తీర్పును శిరసావహిస్తామని..టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి.. ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల్లోనే ఉంటామన్న హరీశ్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
Read More »తెలంగాణలో కరోనా అప్డేట్ -కొత్తగా 1,196 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,53,651కి చేరింది ఇందులో 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,34,234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఐదుగురు కరోనాతో మృతిచెందగా, మొత్తం 1,390 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 47,29,401 కరోనా టెస్టులు చేశారు.
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్
తెలంగాణలో ఈ రోజు విడుదలవుతున్నదుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కచ్చితంగా దుబ్బాక టీఆర్ఎస్దేనని అధిష్టానం, స్థానిక నేతలు భావించారు. అంతేకాదు.. మంత్రి హరీష్ రావు ఈ ఎన్నికను చాలా సీరియస్గా దగ్గరుండి మరీ చూసుకున్నారు. అయితే ఫలితాలకు వచ్చేసరికి పూర్తిగా తారుమారైంది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో తప్ప టీఆర్ఎస్.. రౌండ్లలో మాత్రం ఎక్కడా ఆధిక్యత చూపలేదు. ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ముందంజ
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్లో కారు జోరు అప్పుడే మొదలైంది. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ముందంజలో ఉంది. ఈ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలను తెరిచింది. కొద్దిసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈవీఎంల మొదటి రౌండ్ లెక్కింపు షురూ అయ్యింది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. బీజేపీ …
Read More »దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు- 3 రౌండ్లో ఆధిక్యంలో బీజేపీ
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింట్ ఈ రోజు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లలో జరిగిన కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్లో బీజేపీ 341, రెండవ రౌండ్లో 279, మూడో రౌండ్లో 750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు. సుజాత ముందంజలో ఉంటారని అందరూ భావించినప్పటికీ బీజేపీ …
Read More »తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,51,188కి చేరింది ఇందులో 19,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,30,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నలుగురు మృతిచెందగా.. కరోనా మృతుల సంఖ్య 1,381కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 250 కేసులు వచ్చాయి.
Read More »