తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూసుఫ్గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు …
Read More »సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు
లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కారణంగా నిన్న సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఇవాళ మరికొన్ని పరీక్షలు చేయించుకునేందుకు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్లనున్నారు. ఎంఆర్ఐ, సిటీస్కాన్తో పాటు తదితర పరీక్షలు సీఎం చేయించుకోనున్నారు.
Read More »నిజమవుతున్న శ్రీకాంతాచారి కలలు
తెలంగాణ రాష్ట్రం వస్తేనే పడావు భూములకు పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో వలసలు బందయినయ్. పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనయ్. తమ బిడ్డకు నివాళిగా గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గొల్లపల్లిని ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. …
Read More »త్వరలో తెలంగాణలో 1400 మంది రేషన్ డీలర్ల నియామకం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని …
Read More »తెలంగాణలో టీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు
తెలంగాణలో నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం టీ సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీ సేవ సంస్థ డైరెక్టర్ ఆడపా వెంకట్ రెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. టికెట్ల బుకింగ్, కొత్త పాన్కార్డు, వివిధ టెలికాం పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జులు, మనీ ట్రాన్స్ఫర్ల వంటి వివిధ రకాల సేవలను టీ సేవలో అందించాలని తెలిపారు. వివరాలకు …
Read More »రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో 6,014.45 కోట్లు జమ
తెలంగాణలో యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 120.29 లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్టు మంగళవారం పేర్కొన్నారు.
Read More »ఖమ్మం గడ్డ టీఆర్ఎస్ అడ్డా-రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేష్ చౌదరి
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియా యాక్టివ్ కార్యకర్తల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి పార్టీ ఆఫీసు ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళి,నగర సోషల్ మీడియా కన్వీనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేశ్ చౌదరి మాట్లాడుతూ “తెలంగాణ ఏర్పడిన అన్ని …
Read More »మహిళలకు అండగా తెలంగాణ సర్కారు
అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్లోనూ రాణిస్తున్నారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దూసుకుపోతున్నారు. మహిళా ప్రగతితోనే రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతో సీంఎం కేసీఆర్ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ‘షీ క్యాబ్స్’ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 18 మంది …
Read More »ఖమ్మం అభివృద్ధి గుమ్మం
అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో కారు.. గులాబీ జెండా.. కేసీఆర్ మాత్రమే ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని త్రీ టౌన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందల కోట్ల రూపాయలతో ఖమ్మం నగరాన్ని ఆధునీకరించామని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, పార్క్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలతో …
Read More »మంత్రి పువ్వాడ అగ్రహాం
తెలంగాణలో ఖమ్మం అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉండాలని.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తూ తపన పడుతుంటే మండల సమావేశానికి రావడానికి సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు తీరిక లేదా అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో బాధ్యతో గెలిపించి గ్రామాభివృద్ధి చేయాలని బాధ్యతలు అప్పగిస్తే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. సోమవారం జిల్లాలోని రఘునాధపాలెం మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య …
Read More »