హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, జడ్పీ చైర్మెన్ల వరకూ భేటికి ఆహ్వానించారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. పట్టబధ్రుల ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్లో భారీ …
Read More »ధాన్యం సేకరణలో తెలంగాణకు రెండో స్థానం
2019-20 వానాకాలం ధాన్యం సేకరణలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి దాన్వే రావ్ సాహెబ్ పేర్కొన్నారు. పంజాబ్ నుంచి 162.33లక్షల టన్నుల ధాన్యం సేకరించింది.. తెలంగాణ నుంచి 111.26లక్షల టన్నులు సేకరించినట్లు తెలిపారు. ప్రతిఏటా ఈ పరిమాణం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఇంకా TSలో గడిచిన నాలుగేళ్ల కాలంలో 97,133 బోగస్ రేషన్ కార్డులు రద్దు చేసినట్లు దాన్వే వివరించారు.
Read More »తెలంగాణలో ఈ నెల 13 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సిన్
తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు …
Read More »ఈ నెల 7న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను …
Read More »రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శవంతమని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల, నల్లబెల్లి, దమ్మన్నపేట, ల్యాబర్తి, వర్ధన్నపేట గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని, రైతును రాజును చేయడమే …
Read More »తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు
తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, పెట్రోల్తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గానీ, రోడ్డు …
Read More »తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ బియ్యం సరఫరాలో అమలు చేస్తున్న ఓటీపీ విధానంతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు.. పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇక ఆధార్ కు ఫోన్ నంబర్, ఐరిస్ అనుసంధాన ప్రక్రియ రేషన్ షాపుల్లోనే చేయాలని నిర్ణయించింది. దీనిపై వినియోగదారులకు అవగాహన లేక హైరానా పడుతున్నారు. మీసేవా, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. …
Read More »నిరుద్యోగ యువతకు మంత్రి హారీష్ భరోసా
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు యాబై వేల ఉద్యోగాలపై క్లారిటీచ్చారు.సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హారీష్ మాట్లాడుతూ” ప్రభుత్వం త్వరలోనే 50వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. సి మాట్లాడిన మంత్రి.. ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ-యువకులకు …
Read More »SDG సాధనలో తెలంగాణ భేష్
సమీకృత అభివృద్ధి లక్ష్యాల(SDG) సాధనలో తెలంగాణ రాష్ట్ర పనితీరు బాగుందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2019లో ఎస్ డీజీ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2015-19 మధ్యకాలంలో మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగిందని వివరించింది. అటు వెనుకబడిన 20 శాతం మండలాల అభివృద్ధికి కార్యచరణ రూపొందించాలని సూచించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదం అభివృద్ధిపై ప్రభావం చూపుతున్న 35 జిల్లాల్లో.. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో …
Read More »హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.
Read More »