మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు అధికా రం ఇచ్చారని.. ఏ ఢిల్లీవోడో నామినేట్ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదని పేర్కొన్నారు. ఏండ్లు గా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని చెప్పారు. రాష్ర్టానికి అన్యాయం …
Read More »నల్లగొండ నీటి సమస్యలకు పరిష్కారం
ఏడాదిన్నరలో నల్లగొండ సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. చెప్పినవిధంగా నీళ్లియ్యకపోతే ఓట్లు అడగబోమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనచేశామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రతి ఎకరాకూ సాగునీరిస్తా నల్లగొండ చాలా చాలా నష్టపోయినా జిల్లా. అనాదిగా కష్టనష్టాలు పడ్డ జిల్లా. ఎన్నడూ ఏ …
Read More »సిద్దిపేటలో మంత్రి హారీష్ బిజీ బిజీ
సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నియోజకవర్గంలోని నంగునూర్ మండలం గట్లమాల్యాలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.22 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అదేవిధంగా రూ.9 లక్షలతో కొత్తగా నిర్మించిన గంగిరెద్దుల భవనం, రూ.7.5 లక్షతో నిర్మించిన డంప్ షెడ్డు, రూ. 60 లక్షల వ్యయంతో …
Read More »తెలంగాణ సీఎం మార్పుపై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు.సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకంపై చర్చించనున్నారు. టీఆర్ఎస్ వార్షికోత్సవం (ఏప్రిల్ 27) నాటికి పరిస్థితులను బట్టి ప్లీనరీ నిర్వహించేది.? లేనిది ఈ …
Read More »మాజీ ఎమ్మెల్యే నోములకు సీఎం కేసీఆర్ నివాళి
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా పార్టీ ముఖ్య నేతలు, మంత్రి కేటీఆర్తో కలిసి టీఆర్ఎస్ భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, …
Read More »8 కోట్లతో మేడిపూర్ లో చెక్ డ్యాం నిర్మాణానికి” మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన
జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో వెల్గటూర్ పెద్ద వాకుపై రూ 4.60 కోట్లతో నూతనంగా నిర్మించే చెక్ డ్యాం/ ఆనకట్టకు ఈరోజు శంకుస్థాపన, అనంతరం గొల్లపల్లి మండలం లొత్తునూర్, చిల్వకోడూర్ గ్రామాల్లో సదా జల వాగు పై 3.61 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం/ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఈ సందర్భంగా మంత్రి …
Read More »మంత్రి కేటీఆర్ చొరవతో… స్వగ్రామానికి హరిలాల్ మృతదేహం
ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడ గుండెపోటుతో మరణించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఆ వ్యక్తి మృతదేహం ఇవాళ సొంతూరుకు చేరుకుంది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండాకు చెందిన మాలోతు హరిలాల్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో.. స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి …
Read More »తెలంగాణలో కొత్తగా 150 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 1610 మంది మరణించగా, 1939 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, నిన్నరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో ఇద్దరు బాధితులు మరణించారని తెలిపింది. మొత్తం యాక్టివ్ …
Read More »త్వరలోనే వరంగల్లో ఇంటింటికీ నల్లా నీరు
వచ్చే ఉగాది నుంచి వరంగల్ మహానగరంలో నల్లాల ద్వారా ఇంటింటికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచినీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదివారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 57వ డివిజన్ హనుమాన్నగర్లో ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి …
Read More »