కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసిన 175 సభ్యత్వాలు, రుసుమును ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన నివాసం వద్ద కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించారు. సభ్యత్వ నమోదుకు తక్కువ సమయం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాడ వాడలా తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ …
Read More »తెలంగాణోచ్చాక ఇచ్చింది 1లక్ష 32వేల సర్కారు ఉద్యోగాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి 1,50,326 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు వివిధ నియామకాల ఏజెన్సీల ద్వారా 1,32,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో 1,26,641 మంది నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి… వీరంతా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 నియామకాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలూ పూర్తవుతాయి. గత ఆరున్నరేండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. …
Read More »జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరిన్ని అధికారాలు, నిధులు కల్పించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరారు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు స్థానిక పరిపాలనలో మరింత భాగస్వామ్యం కల్పించడo, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు వంటి …
Read More »గ్రేటర్ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ …
Read More »సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్ ముఖాముఖి -మీకోసం
కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మార్పులను కొనసాగిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యసేవల రంగంలో ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిస్తూ, రోగులకు ప్రయోజనం చేకూర్చేలా కృత్రిమ మేధ, హాలోగ్రామ్ వంటి టెక్నాలజీలను ప్రోత్సహించాలని సూచించారు. బయోఏషియా-2021 సదస్సు రెండోరోజు ‘హెల్త్కేర్ టు హిట్ రిఫ్రెష్’ అంశంపై చర్చలో సత్య నాదెళ్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే …
Read More »నేడు మహబూబ్నగర్కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం మహబూబ్నగర్కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తండ్రి నారాయణగౌడ్ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా మహబూబ్నగర్కు వెళ్లనున్నారు. ఆదివారం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు.
Read More »తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికి రోల్ మోడల్
దళిత గిరిజనుల హక్కులు కాపాడటంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. దళిత, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. మూడేండ్ల క్రితం (2018) సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు అంకురార్పణ చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ చైర్మన్గా, బోయిళ్ల విద్యాసాగర్, ముదావత్ రాంబాల్నాయక్, కుస్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, చిల్కమర్రి నర్సింహ సభ్యులుగా కమిషన్ ఏర్పాటైంది. అనేక సమస్యలను మూడేండ్లలోనే కమిషన్ పరిష్కరించింది. ఫిర్యాదుల పరిష్కారంలో నూతన …
Read More »మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్ ఎన్నికల్లో తెరాస తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా శ్రీలత …
Read More »ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బయో ఏషియా-2021 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కొవార్టిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని అన్నారు..
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీ దేవి
తెలంగాణలో మార్చి 14న జరగనున్న రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఎంపిక చేశారు. అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం పీవీ నరసింహారావు కూతురు వాణీ దేవికి ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాణి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. సమావేశం …
Read More »