తెలంగాణలో రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పని చేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో మంత్రి హరీశ్రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధత, వ్యాక్సినేషన్, వైద్య సేవలు తదితర అంశాలపై ముఖ్యమైన సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య …
Read More »తెలంగాణలో కొత్తగా 1913 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది… తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,913 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా గత ఇరవై నాలుగంటల్లో కరోనా బారీన పడి ఇద్దరు మరణించారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 1,214 కేసులు ఒక్క రాజధానిమహానగరమైన హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. నిన్న గురువారం కొత్తగా …
Read More »వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.
Read More »15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేయగా.. కొవిన్ యాప్, పోర్టల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. వ్యాక్సిన్ కేంద్రానికి నేరుగా వెళ్లి టీకా తొలి డోసు తీసుకున్న 4 వారాలకు వీరికి రెండో డోసు ఇస్తారు. కాగా ప్రస్తుతం ఈ వయసు వారికి కొవాగ్జిన్ టీకా ఒక్కటే అందుబాటులో ఉంది.
Read More »తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తాజాగా 12
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 12 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 55కి చేరింది. తాజా కేసుల్లో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ (మ) గూడెం గ్రామానికి ఇటీవల వచ్చిన ఓ యువకుడికి ఒమిక్రాన్ వచ్చింది .. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఎల్లారెడ్డిపేట(మ) నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ …
Read More »CM KCR గారి ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కృషి చేద్దాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని సూచించారు. తెలంగాణ ఆయుష్ ఫార్మాసిస్ట్ సెంట్రల్ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి హరీశ్ రావు సోమవారం కొకాపేట …
Read More »తెలంగాణలో మరో 3ఒమిక్రాన్ కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4450 పెరిగింది. ఇప్పటివరకు 10 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు పేర్కొన్నారు.
Read More »త్వరలోనే తెలంగాణలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో వివిధ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే 60 వేల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించగా.. అదనంగా మరో 40 వేల కొలువులు తేలనున్నట్లు సమాచారం. దీంతో 2022లో వరుస నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే శాఖలవారీగా సన్నాహాలు మొదలుపెట్టింది.
Read More »కన్నుల పండుగగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం
కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల …
Read More »