Home / Tag Archives: thanneeru harish rao (page 126)

Tag Archives: thanneeru harish rao

తెలంగాణలో నేటి నుండి ఫీవర్‌ సర్వే

తెలంగాణ రాష్ట్రంలో  శుక్రవారం నుండి ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్‌ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు.లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్‌ …

Read More »

తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. …

Read More »

డీఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్లో జమ కానుండగా.. 2021 జూలై నుంచి బకాయిలు జీపీఎఫ్ ప్రభుత్వం జమ చేయనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More »

తెలంగాణలోని సర్కారు బడులకు మహర్ద

తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నది.. ఇందుకోసం రూ.7,289 కోట్లు కేటాయించనున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో రూ.7,300కోట్లతో మౌలిక వసతులు కల్పన ..మన ఊరు -మన బడి విధి విధానాలతో మారనున్న ప్రభుత్వ స్కూళ్లుఈ పథకంలో భాగంగా మూడేండ్లలో …

Read More »

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఈరోజు వరంగల్ జిల్లాల్లో పర్యటించాలని నిన్న కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. ఇతర కారణాల వల్ల ఆ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం జిల్లాలో పర్యటించి పంటపొలాలను పరిశీలించనున్నారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 1,963 మందికి కరోనా వైరస్

తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.

Read More »

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు బదలాయింపును ఈ నెలలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.

Read More »

నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

Read More »

నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్లో నిర్వహించిన #askktrలో భాగంగా ఓ నెటిజన్ లాక్ డౌన్ గురించి ప్రశ్నించాడు. దానికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసుల సంఖ్య, వైద్యశాఖ అధికారుల సలహాను బట్టి లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా.. తెలంగాణలో 18,339 యాక్టివ్(నిన్నటి వరకూ) కేసులున్నాయి. రోజుకు దాదాపు 2000కేసులు వెలుగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat