కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ జాతర సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అమ్మవారి జాతర సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కట్ట మైసమ్మ అమ్మవారి దీవెనలు ప్రజలపై తప్పక ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని …
Read More »మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలి
ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు.శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కోర్ట్ హాల్ నుండి మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర …
Read More »10 లక్షలతో పాటు అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లే దళిత బంధు ఉద్దేశం: సీఎం కేసీఆర్
తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం అద్భుతమైనదని.. ఆ పథకం కింద దళితులకు కేవలం రూ.10 లక్షలు ఇవ్వడమే కాదు.. ఇదివరకు దళితులకు లేని ఎన్నో రిజర్వేషన్లను ఈ స్కీమ్ ద్వారా కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఇదివరకు దళితులకు రాని ఎన్నో ఫెసిలిటీలను …
Read More »ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్ సూట్ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూట్ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది.ప్రెసిడెన్షియల్ సూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో …
Read More »మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు మంత్రి కే తారకరామారావు ఎన్నారైలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …
Read More »మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ ఏడాది కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 నుంచి 19 వరకు జరుగనున్న దేశంలోనే …
Read More »CM KCR పై బండి సంజయ్ ఫైర్
జనగామ సభలో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘కేసీఆర్ చెల్లని రూపాయి. బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు కాదు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో.. ఏం పీకారో చెప్పాలి. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఓడిపోతాననే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు’ అని బండి ఫైర్ అయ్యారు.
Read More »అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానం
తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధిస్తామన్న 2001 నాటి కేసీఆర్ ప్రకటనను గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్న సీఎం కేసీఆర్ సాహసోపేత ప్రకటనపై గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. అదే తెలంగాణ నేడు కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »TRSలోకి భారీగా చేరికలు
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ సమక్షంలో ఏనేకుంట తండాకు చెందిన బానోతు సుందర్, రామచంద్ర, బిచ్చా, సర్వన్తో పాటు మరో 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే కిశోర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్కు …
Read More »మోదీపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు.. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోదీ పని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.హనుమకొండలో టీ డయాగ్నోస్టిక్, రేడియాలజీ ల్యాబ్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల బలిదానాలను కించపరిచారు అని …
Read More »