తమ ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కోకాపేటలో 49.94 ఎకరాలు, ఖానామెట్లో 14.91 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ నేత, మాజీ …
Read More »తెలంగాణలో మరో 1000కోట్ల పెట్టుబడి
ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్లోని తమ సంస్థను రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నది. రక్షణరంగం సైనిక విమానాలకు ఉపయోగించే టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఎంఆర్ఎఫ్ నిర్ణయించింది. దీనికోసం కంపెనీలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మమ్మెన్ గురువారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే.తారకరామారావుతో సమావేశమై కంపెనీ విస్తరణపై చర్చించారు.పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఎంఆర్ఎఫ్ …
Read More »సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ట్రోఫీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ట్రోఫీలో హీరో అక్కినేని అఖిల్, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ట్రోఫీలో 258 జట్లు, 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. …
Read More »దేశానికి కొత్త అభివృద్ధి నమూన ‘కేసీఆర్’
పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి దేశవ్యాపితంగా చర్చ జరుగుతుందని, ఆయన ఆలోచనల ధారల్లో దేశానికే నూతన ప్రణాళిక రచించుకునే సమయం అసన్నమైందని అన్నారు. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన “కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ …
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తా
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భారం మోపే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఛార్జీల పేరుతో అదనపు బిల్లులను ప్రజల నుంచి వసూలు చేస్తోందని విమర్శించారు. విద్యుత్ వినియోగదారులకు డెవలప్మెంట్ ఛార్జీల భారం కేసీఆర్ పుట్టినరోజు కానుకనా? అని ప్రశ్నించారు. డెవలప్మెంట్ ఛార్జీల భారం ఎత్తేస్తే రేపు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తానని తెలిపారు.
Read More »తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు శాఖలో ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా.. మిగిలిన శాఖలతో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. ఈ శాఖలో దాదాపు 16వేల కానిస్టేబుల్, వెయ్యి ఎస్సై పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
Read More »బీజేపీ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలేదు
దేశంలో అన్ని రంగాల వార్ని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని …
Read More »నువ్వు నేను మూవీని గుర్తుకు తెచ్చిన రేవంత్ యవ్వారం
దివంగత యువనటుడు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోగా అనిత హీరోయిన్ వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సింది. అయితే ఈ మూవీ ఒక సీన్ లో క్లాస్ రూమ్ లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్ సునీల్ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేదాకా నేను కూర్చోను …
Read More »సీఎం కేసీఆర్తో మాట్లాడిన దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ జయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. సాధారణ ప్రజల బాగు కోసం వినమ్రంగా కలిసి పనిచేయాలని దీదీ పిలుపునిచ్చారు. యూపీ ఎన్నికల్లో టీఎంసీ బరిలోకి దిగలేదని, చాలా విశాలమైన ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు …
Read More »ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు
ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? దమ్ముంటే చూపించాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు.ముస్తాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని …
Read More »