వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందన కోసం చూస్తాము… ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి …
Read More »గ్రేటర్ ఆర్టీసీలో పెను మార్పులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన ఈడీతో పాటు ఇద్దరు ఆర్ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్లో బస్సుల ఆపరేషన్స్పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ జోన్ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో …
Read More »ఎయిరో స్పేస్ తయారీ హబ్గా హైదరాబాద్-మంత్రి వేముల
ఎయిరో స్పేస్ (aerospace) తయారీ హబ్గా హైదరాబాద్ (Hyderabad) ఎదుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏవియేషన్ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్కు గర్వకారణమన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని ఆయన చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్ షోలో భాగంగా వింగ్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »కళ్యాణ లక్ష్మీకి ప్రేరణ అయిన కల్పన కూతురు చంద్రకళ పెళ్లికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన బిడ్డ కల్పన ప్రేరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం 10 లక్షల మంది ఆడ పిల్లల జీవితాలలో వెలుగులు నింపింది అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలతో …
Read More »పీయూష్ గోయెల్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి -గుర్రాల నాగరాజు (TRS NRI సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు ).
తెలంగాణ రైతులపై కేంద్రం ముందునుంచే చిన్న చూపు చూస్తుంది, యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన తెరాస మంతులతో అహంకారపూరితనగా మాట్లాడిన పీయూష్ గోయెల్ తెలంగాణ సమాజానికి , రైతాంగానికి క్షమాపణ చెప్పాలి గుర్రాల నాగరాజు డిమాండ్ చేసారు. తెలంగాణ లో వున్న బీజేపీ ఎంపీలు తెలంగాణ గురించి ఆలోచించే సమయం లేదు , రోజుకో కొత్త వేషం వేషి అసలు సమస్యలను పక్కన పెడుతున్నారు …
Read More »అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో భోజన ఛార్జీలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వివిధ వర్గాలకు అందజేసే భోజన ఛార్జీలను పెంచుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రోగులందరికీ, అలాగే గిరిజన రోగుల సహాయకులకు అందజేసే భోజన ఛార్జీ ప్రస్తుతం రూ.40 ఉండగా, దాన్ని రూ.80కి పెంచారు. TB, మానసిక రోగులు, థెరపాటిక్ రోగులకు ప్రస్తుతం రూ.56 ఇస్తుండగా, దాన్ని రూ. 112కి పెంచారు. ఇక డ్యూటీ డాక్టర్లకు రూ. 80 …
Read More »ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం సీఎం కేసీఆర్
ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ధాన్యం సేకరణ విషయంపై కేంద్రంతో చర్చించేందుకు రేపు మంత్రుల బృందం, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి, మెమోరాండం అందజేస్తారన్నారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం.. సమ్మతించని పక్షంలో ఎంతని పోరాటానికైనా సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు. ‘ఈ పోరాటం ఆషామాషీగా …
Read More »దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్మెంట్ ఫైల్స్ -సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్ లో గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులతో సహా పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాశ్మీర్ ఫైల్స్ …
Read More »తెలంగాణ భవన్లో ప్రారంభమైన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర సీఎం,గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర …
Read More »రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఉన్న అనేక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేస్తూ చాలా వరకు అధిగమించాం. …
Read More »