మండుటెండల్లో చెరువుల్లో.. చెక్ డ్యామ్ ల్లో మత్తళ్లు దుంకుతున్న చరిత్ర నేటి తెలంగాణ ప్రభుత్వం లో..సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో అవిష్కృతం అయిందని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో గంగమ్మ దేవాలయ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరిశ్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చూస్తే ఎండాకాలం..కానీ గంగమ్మ ఒడిలో చిన్నకోడూర్ చెరువులో …
Read More »రేవంత్ కు ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై అధికార టీఆర్ఎస్ కు చెందిన కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిన్న బుధవారం నగరంలో టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు ముఖ్యంగా బీసీలంటే రేవంత్ రెడ్డికి చులకన భావం. ఆయన వెంటనే వాళ్లకు భేషరత్ గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల …
Read More »వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి
తెలంగాణ రైతాంగం రబీ సీజన్ లో పండించిన వరి ధాన్యం అంతటిని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. బుధవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, డి.రాజేశ్వర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన …
Read More »ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు – హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల …
Read More »దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం
తెలంగాణలోని దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంత్రి మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ …
Read More »తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో మరో ముందడుగు
తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన బఢ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ప్రక్రియలో భాగంగా మరో ముందడుగు పడింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్, …
Read More »యాదాద్రి కల సాకారం.. KCR పేరు చరిత్రలో నిలిచిపోతుంది -గుర్రాల నాగరాజు(TRS NRI సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు)
యాదాద్రిలో ఈ రోజు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా ఈరోజు పూజలు జరిపించారు. మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ వచ్చిన తరువాత తన సంకల్పం తో …
Read More »యాదాద్రిలో శాస్రోక్తంగా ముగిసిన మహాకుంభ సంప్రోక్షణ..
నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శోభాయాత్ర, విమాన గోపురాలకు పవిత్ర జలాలతో అభిషేకం, ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో నమో నారసింహ మంత్రం ప్రతి ధ్వనించింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ …
Read More »టీఎస్పీఎస్సీ నుండి ఓ శుభవార్త
సర్కారు ఉద్యోగాలకై దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకోసం టీఎస్పీఎస్సీ ఓ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్)లో మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లు ఏర్పాడ్డాయి. దీంతో అభ్యర్థుల స్థానికత మారిపోయింది.
Read More »నేత్రపర్వంగా మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
తెలంగాణ రాష్ట్రంలో శ్రీలక్ష్మీ నరసింహా స్వామి కొలువై ఉన్న యాదాద్రిలో ఈరోజు సోమవారం మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. ఇందులో భాగంగా దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్కు కంకణధారణ చేసి ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. …
Read More »