తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత …
Read More »కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. వంద శాతం సాధించినట్లు మండల విద్యాధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడు బాసర ఐఐటీలో …
Read More »అల్వాల్ టిమ్స్కు సీఎం కేసీఆర్ భూమిపూజ
అల్వాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. …
Read More »తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం
గత ఎనిమిదేండ్లుగా సంక్షేమాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం తాజాగా వైద్యరంగంలో నెంబర్ వన్ గా నిలవడానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కరోనా లాంటి మహమ్మారిని కట్టడీలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్ (బొల్లారం), సనత్నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), …
Read More »బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు సవాల్
తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఒక అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పి నిజమని చిత్రీకరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్ఎ్సఎల్పీలో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్లతో కలిసి ఆయన …
Read More »మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల నియంత్రణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ పంపింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, …
Read More »హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్)లో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం రూ.2,679 కోట్లతో ఎల్బీనగర్ (రూ.900 కోట్లు), సనత్ నగర్ (రూ.882 కోట్లు), అల్వాల్ (రూ.897)లో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టిమ్స్ ఉండగా.. కొత్తవాటితో HYDకు నలువైపులా నాలుగు టిమ్స్ు అందుబాటులోకి రానున్నాయి.
Read More »దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేటలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు
దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎస్టీపీ ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని మని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. చెత్తను మురుగునీటి …
Read More »త్వరలో 13 వేల టీచర్ పోస్టులు భర్తీ-మంత్రి హరీష్ రావు
అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు మంత్రి హరీష్రావు.. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం – సర్కారు దవాఖానాల్లో రూ.5కే భోజనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పద్దెనిమిది సర్కారు దవాఖానాల్లో రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం రూ.5కే రుచికరమైన ఇంటి భోజనం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ సమక్షంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు …
Read More »