Home / Tag Archives: telanganagovernament (page 218)

Tag Archives: telanganagovernament

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 64 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  మరో 64 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,39,981 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూను లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ కృపతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి …

Read More »

నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గుడ్డలూడదీసి కొడుతామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను డ్రగ్స్‌ అంబాసిడర్‌ అనటంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని, మరి కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ కూడా పరీక్షకు సిద్ధమా? అని సవాలు విసిరారు. రూ.50 …

Read More »

పీసీసీ కొనుక్కున్నోడు.. టికెట్లు అమ్ముకోడా.. రేవంత్‌పై కేటీఆర్‌ సెటైర్‌

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్ర‌టేరియ‌ట్‌కు వ‌చ్చాడా.. ఫామ్ హౌస్‌లో ఉన్నాడా కాదు.. ప‌నులు అవుతున్నాయా? లేదా? చూడాల‌న్నారు. ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకొని తాగుబోతు అన‌డం స‌రికాద‌న్నారు. ఎవ‌ర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడుతామ‌ని …

Read More »

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్‌ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ్ణ హోటల్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కిటెక్స్‌ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …

Read More »

రూర్బన్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ టాప్‌

తెలంగాణ కీర్తి పతాక మరోసారి జాతీయ స్థాయిలో ఎగిసింది. రూర్బన్‌ పథకం అమలులో తొలి రెండు స్థానాలు మన రాష్ర్టానికే దక్కాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం ప్రకటించిన రూర్బన్‌ ర్యాంక్‌లలో సంగారెడ్డి జిల్లాలోని ర్యాకల్‌ క్లస్టర్‌ మొదటి స్థానం సాధించగా, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ క్లస్టర్‌ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 14 అంశాలను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ర్యాంక్‌లు ప్రకటించింది. ర్యాకల్‌ క్లస్టర్‌కు 91.93, జుక్కల్‌కు 91.52 స్కోర్‌ …

Read More »

మాణిక్యం ఠాగూర్‌కు మంత్రి కేటీఆర్ చుర‌క‌లు

ఏఐసీసీ నాయ‌కుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆయ‌న‌కు చుర‌క‌లంటించారు. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌ను ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శించిన రేవంత్ రెడ్డి ఆడియో క్లిప్ బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో.. దాన్ని ఉద్దేశించి ఠాగూర్ ట్వీట్ చేశారు. ఓ సంభాష‌ణ‌ను జ‌ర్న‌లిస్టు రికార్డు చేసి, దాన్ని అధికారంలో ఉన్న వారికి పంపితే, అలాంటి జ‌ర్న‌లిస్టుల గురించి ఏం ఆలోచించాలి? అని ఠాగూర్ ప్ర‌శ్నిస్తూ.. …

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడ్డగాడిదా?-మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని …

Read More »

కిటెక్స్ గ్రూప్ మరియు తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కార్యక్రమం

తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో  ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్న సంస్థ.ఈ మేరకి ప్రభుత్వంతో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్న కంపెనీ, మరియు ప్రభుత్వ అధికారులు.ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కే. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు,పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, kitex గ్రూప్ …

Read More »

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాన‌వ‌తావాది : మంత్రి కేటీఆర్

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మాన‌వ‌తావాది అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. ఎంజీ రంజిత్ రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బేగంపేట‌లో దివ్యాంగుల‌కు ట్రై మోటార్ వాహ‌నాల‌ను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 105 మందికి ట్రై మోటార్ వాహ‌నాల‌ను పంపిణీ చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat