Home / Tag Archives: telanganagovernament (page 19)

Tag Archives: telanganagovernament

అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నాం

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. నిమ్స్‌ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగైదు రోజుల్లో కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేస్తామన్నారు. శాసన మండలిలో వైద్యారోగ్యశాఖపై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి హరీశ్‌ రావు సమాధానం ఇచ్చారు. కళ్ల కలకతో వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు. కళ్ల కలక నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్ల …

Read More »

జయశంకర్ సారుకి సీఎం కేసీఆర్ నివాళులు

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌   జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌  నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్‌ సార్‌కు నివాళులు అర్పించారు.

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో  తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్‌ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

Read More »

అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కారు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఏడాది ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో వైద్యారోగ్యం పంచాయతీ రాజ్ శాఖలకు ముప్పై నాలుగు శాతం అధికంగా ఖర్చు పెట్టినట్లు..గృహ నిర్మాణం పరిశ్రమల శాఖలకు కేటాయింపులకంటే తక్కువగా ఖర్చు చేసినట్లు తెలిపింది. వంద రోజుల పాటు రూ ఇరవై రెండు వేల …

Read More »

మాజీ తుమ్మలను కలిసిన రైతులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి రైతులు శనివారం ఉదయం గండుగులపల్లి లోని తుమ్మల గారి నివాసంలో మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారిని మన్యం అప్పారావు, ఊకే చందర్రావు గార్ల ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట రెవెన్యూ మోజాలోని 1458 సర్వే నంబర్ లో గల భూములకు నూతన పాస్ పుస్తకాలు అందకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, …

Read More »

ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ సర్కారు వివరణ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం   చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్‌ తమిళిసై   బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు  పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్‌ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ …

Read More »

తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3,23,396 మందికి ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగాలు సృష్టించినట్టు మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీసాక్షిగా వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హైదరాబాద్‌ నిలదొక్కుకోవడంతో ఎకరం రూ.వంద కోట్లు పలికే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో స్టేబుల్‌ గవర్నమెంట్‌, ఏబుల్‌ లీడర్‌షీప్‌ ఉన్నందునే ఇది …

Read More »

30 నిమిషాలు కూర్చోలేరు.. 30 రోజులు సభ పెట్టాలా?- మంత్రి కేటీఆర్

అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన ప్రతిపక్ష సభ్యులు లాబీల్లో టైమ్‌పాస్‌ చేస్తున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడైనా ప్రతిపక్షం తమ పాత్ర సరిగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో కనీసం 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదని ఎద్దేవా చేశారు. ఎస్సార్డీపీపై ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చే సమయంలో కాం గ్రెస్‌, బీజేపీకి చెందిన …

Read More »

గిరిజనుల పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్షత

దేశంలో ఉన్న గిరిజనుల పట్ల ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సాక్షిగా  విమర్శించారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న మణిపూర్‌లో  ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గిరిజనుల   హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం  తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసన మండలిలో …

Read More »

శాసనమండలిలో సర్కారు బడుల విద్యార్థులు

తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని ఈరోజు శనివారం  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు  సందర్శించారు. తొలిసారి మండలికి వచ్చిన ఈ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి  విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్‌ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat