జీవితం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. ఆచార్య జయశంకర్ గారి 85వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన టి ఆర్ ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ గారికి కి …
Read More »జయశంకర్ సార్ జయంతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
Read More »గోదావరికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డకు చేరుకున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి వెంట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,రాజ్యసభ జోగినపల్లి ఎంపీ సంతోష్కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ ఘనంగా స్వాగతం పలికారు. …
Read More »సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామ వికాసంలో పంచాయతీ …
Read More »‘ఆర్ట్ ఫర్ ఏ కాజ్’ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఆర్ట్ ఫర్ ఏ కాజ్’ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ను ఎంపీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్ను ఎంపీ సంతోష్ అభినందించారు. పెయింటింగ్స్ …
Read More »వరిపోలంలో ఎమ్మెల్యే రేఖానాయక్
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో సాగు జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ముసురును సైతం లెక్కచేయకుండా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ …
Read More »మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా
తెలంగాణా రాష్ట్రంలో సికింద్రాబాద నియోజగవర్గంలో చిలకలగూడ ఈద్గాను మోడల్ ఈద్గాగా తీర్చిదిద్దామని, ఆ తరహాలోనే శేశాపహాడ్ ఈద్గా ను అభివృధి చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి పద్మారావు గౌడ్ శుక్రవారం శేశాపహాడ్ ఈద్గా ను సందర్శించారు. ఈద్గా ప్రహరి గోడ పాక్షికంగా కూలిపోవడంతో అపయకరంగా మారిన అంశాన్ని గుర్తించి వెంటనే పునర్నిర్మాణం, మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను పద్మారావు గౌడ్ …
Read More »మంత్రి నిరంజన్రెడ్డి తల్లి తారకమ్మకు సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి చేరుకున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తల్లి తారకమ్మ జులై 22వ తేదీన స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఈ రోజు తారకమ్మ దశదినకర్మ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తారకమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నిరంజన్రెడ్డిని పరామర్శించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ నాయకులు, జిల్లాకు చెందిన అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read More »సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన.. పైనుండి వస్తున్న వరదల వలన ఆల్మట్టి,నారాయణ్ పూర్ నుంచి కృష్ణానది పరవళ్లు తొక్కుతూ వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు వస్తున్నాయి.దీనివలన జూరాల నిండిన వెంటనే నెట్టెంపాడు,బీమా,కోయిల్ సాగర్ లిప్టులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీచేశారు. భారీగా వరద వచ్చే అవకాశమున్నందున పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం …
Read More »