త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం …
Read More »కొత్త రెవెన్యూ చట్టంపై శాసన మండలిలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సుమారు అరగంటకుపైగా మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని.. కోవిడ్ ప్రభావం వల్ల రెవెన్యూ చట్టం ఆలస్యమైందన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామని.. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు. మోదీ ప్రభుత్వం నష్టం …
Read More »భూమి పుత్రుడా నీకు వందనం
వీర రుద్రుల భూమి యెవనిది? నీరు ఎవనిది? నింగి యెవనిది? భోగమెవనిది? యోగ మెవనిది? భుక్తి కరువుకు మూలమెవ్వడు? అని 69 తెలంగాణ ఉద్యమం నిగ్గదీసిన నాటి నుంచి.. ప్రశ్నల కొడవళ్లతో తెలంగాణ అలుపులేని పోరాటం చేసింది. అనన్య త్యాగాల ఫలంగా ఫలించిన తెలంగాణ… ఉద్యమ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమస్యల చిక్కుముడులన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకొంటున్నది. ఆ ప్రస్థానంలో భాగమే కొత్త రెవెన్యూ చట్టం. మన తెలంగాణ చరిత్రను మలుపు తిప్పగల …
Read More »నగరాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి సభ ముందు ఉంచారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎస్ఆర్డీపీ కింద 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్పాస్లు, 3 ఆర్యూబీ, ఒక వంతెనతో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు మంత్రి …
Read More »లక్ష కేసులొచ్చినా వైద్యం చేసే సత్తా ఉంది
తెలంగాణ రాష్ట్రంలో లక్ష పాజిటివ్ కేసులొచ్చినా చికిత్స, వైద్యం అందించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరో నా రహిత రాష్ట్రంగా కాకపోయినా వైరస్ చావులు లేని తెలంగాణగా మార్చేందుకు అందరూ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరు నెలలుగా తా ను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తుంటే.. ‘ఏయ్ రాజేందర్, ఎన్ని వందల …
Read More »పంచాది లేకుండా పంపకాలు
తాతల నుంచి వచ్చిన భూములు పంచుడంటేనే పంచాదిలు. తిట్టుకునుడు, కొట్టుకునుడు దాకా పోతయి. కానీ, అట్లోంటి పంచాయితీలకు కొత్త రెవెన్యూ చట్టంతో సర్కారు చెక్ పెట్టింది. వంశపారంపర్య భూమిని (ఫౌతీ) పంచుకొనే హక్కును కుటుంబానికే అప్పగించింది.వారసులంతా కూర్చొని, మాట్లాడుకొని పంపకాలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నది. లొల్లి.. కొట్లాటలు వారసత్వంగా వచ్చే భూమి పంపకాల్లో గొడవలకు కొదవేలేదు. ప్రస్తుత విధానంలో వారసులు ముందుగా అడంగల్, పహాణీ, పట్టాదారు పాస్పుస్తకం, టైటిల్డీడ్ తదితర …
Read More »రెవిన్యూ చట్టం దేశంలోనే సంచలనం
తెలంగాణ వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇవాళ అంతే సంతోషంగా ఉన్నా. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులకు, నిరుపేదలకు, నోరులేనివారికి అండగా నిలిచే చట్టాన్ని తీసుకొస్తున్నాం. సరళీకృతమైన, అవినీతిరహితమైన ఇంత గొప్ప చట్టాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో చరిత్రాత్మకమైన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ భావోద్వేగానికి …
Read More »ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెస్తాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ …
Read More »రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు, పాస్పుస్తకాల చట్టం – 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం – 2020 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. ‘‘భూలావాదేవీలకు వెబ్సైట్ ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేయాలి. సబ్రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్గేజ్ చేస్తే ధరణి …
Read More »రైతన్న నీకు నేనున్నా
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభం కానున్నది. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ.. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బుధవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. 140కి పైగా చట్టాలు.. సంక్లిష్ట నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పించిన సంగతి తెలిసిందే. అన్ని కోణాల్లో ఆలోచించి.. అన్ని వర్గాలను, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »