కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారా?, ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న ఏ ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మాత్పల్లి, మంగోల్ గ్రా మాల్లో మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులకు …
Read More »కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే కేంద్రం నూతన వ్యవసాయ బిల్లు
కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను నిర్వీర్యం చేసే చర్య జరుగుతోందని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా కనీస మద్దతు ధరను తీసివేసే యోచన జరుగుతోందని అన్నారు. లాభ నస్టాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు …
Read More »జోరుగా కొనసాగుతున్న ఎల్ఆర్ఎస్
లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల …
Read More »జలుబు,జ్వరం వస్తే భయపడకండి
జలుబు,జ్వరం వస్తే కరోనా అని భయపడకండి..ఏమీ చేయదు…త్వరగా రికవరీ అవుతారు..మిమ్మల్ని ఏమి చేయదు…కరోనాతో భయపడకండి… మీకు నేను అండగా ఉన్నాను. ధైర్యంగా ఉందాం.. కరోనాని ఎదుర్కొందాం… మీరెట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందొద్దు. మరీ సమస్యగా ఉంటే నాకు గానీ, నా సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. 24 గంటలూ అందుబాటులో ఉంటాం. అందరినీ ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. …
Read More »మొబైల్ తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తుకు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. కేవలం ఒక్క క్లిక్ దూరంలోనే. మొబైల్తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబరు 1 నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో …
Read More »రెవెన్యూచట్టం అమలు, ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ సమీక్ష
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయభూముల వద్ద, బావులకాడి ఇండ్లు, ఫామ్హౌజ్లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్లైన్లో ఉచితంగా మ్యుటేషన్ (ఎన్రోల్) చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నవారికి దేశంలోనే తొలిసారిగా పట్టాదార్ పాస్పుస్తకం జారీచేయనున్నట్టు తెలిపారు. మెరూన్ కలర్లో ప్రత్యేకంగా రూపొందించిన పాస్పుస్తకాలను అందజేస్తామని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులకు పూర్తిరక్షణ …
Read More »ఈవోడీబీలో మరిన్ని సంస్కరణలు-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టిన రాష్ట్రప్రభుత్వం సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఈవోడీబీలో తాము చేపట్టనున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈవోడీబీ -2020 సంస్కరణలపై బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా …
Read More »తెలంగాణోచ్చాకే అభివృద్ధి
తెలంగాణ రాష్ర్ట ప్రజల గోడు అర్థమయ్యేలా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా దుబ్బాక ప్రజలు తీర్పు చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ …
Read More »అసెంబ్లీలో నేతన్నల గొంతు వినిపించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల వాయిస్ ను వినిపించారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. – రాష్ట్ర చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్లు కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాది మార్గాన్ని చూపిస్తున్నారు.. – వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50వేల దుప్పట్లు,40 వేల కార్పేట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. – ప్రభుత్వానికి బారం అయినా నేతన్నల క్షేమం,ఉపాది …
Read More »తెలంగాణలో యూరియా కొరత లేదు
– ఫోన్ చేస్తే ఆరుగంటల వ్యవధిలో యూరియా అందుబాటులో ఉంచుతాం – శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో యూరియా కొరత ఉంటే కాల్ చేయండి – గత ఏడాదికన్నా 33.06 శాతం సాగువిస్తీర్ణం పెరిగినా ఎక్కడా యూరియా కొరత లేకుండా చేశాం – ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 9.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం .. ఇంకా లక్ష టన్నుల పై చిలుకు యూరియా కేంద్రం నుండి రావాల్సి ఉంది – …
Read More »