తన పేరిట ఉన్న వ్యవసాయేతర ఆస్తులను సీఎం కేసీఆర్.. నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ వివరాలతోపాటు కేసీఆర్ ఫొటోను సిబ్బంది యాప్లో అప్లోడ్ చేశారు. అనంతరం …
Read More »యువకులే టీఆర్ఎస్ సైనికులు..
విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు టీఆరెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ , అదేవిధంగా రాయ్ పోల్ మండలం అనాజ్ పూర్, తిమ్మక్క పల్లి చెందిన బీజేపీ యువకులు పెద్ద సంఖ్యలో శనివారం టీఆరెస్ పార్టీలో చేరారు. వీరిని మంత్రి హరీష్ రావు గారు గులాబీ కండువలతో ఆహ్వానించారు. ఈ …
Read More »దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం!
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించనున్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం కేటాయించింది. ఈమేరకు టీఆర్ఎస్ అధ్యక్షుడికి కేంద్ర హౌసింగ్, పట్టణ మంత్రిత్వ శాఖ అధికారి దీన్దయాళ్ లేఖను పంపారు. స్థలం కేటాయింపు పూర్తయిన నేపథంలో టీఆర్ఎస్ …
Read More »ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవు
దుబ్బాకలో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నిక ముగిశాక మళ్లీ కనిపించరని మంత్రి హరీశ్రావు అన్నారు. పెద్ద పెద్ద కార్లు, సూట్కేసులతో వస్తున్నారని, కానీ.. ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు మాత్రమే మిగిలారని, కార్యకర్తలంతా ఎప్పుడో ఖాళీ అయ్యారని, నాయకులకు తోవ చూపించేవారు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత, 2008 ఉప …
Read More »మంత్రి హారీష్ రావు ఫోటో వైరల్.. అసలు కారణం ఇదే..!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో ఒక లుక్ వేద్దాం. వచ్చే నెల నవంబర్ మూడో తారీఖున దుబ్బాక ఉపఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతి నగర్ కళాశాల, రఘునాధపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల …
Read More »ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గం సమావేశం
ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ర్ట మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక: అప్డేట్స్
నిజామాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా …
Read More »సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు నాంది
ఏడేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు నాంది పలుకుతాయాని నారాయణఖేడ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఉప ఎన్నికల నార్సింగి మండల ఇన్చార్జి భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని భీమ్రావుపల్లి, వల్లూరు, నార్సింగి గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమ ప్రభుత్వం రైతు బంధు, …
Read More »నేటి నుంచే బతుకమ్మ చీరెల పంపిణీ
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడుపడుచులకు ప్రభుత్వం అం దించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. 287 డిజైన్లలో, విభిన్న రంగుల్లో తయారుచేసిన కోటి చీరెలను ఇప్పటికే జిల్లాలకు పంపించారు. వీటి కోసం రూ.317 కోట్లను ప్రభుత్వం వెచ్చింది. తెల్లకార్డు ఉండి, 18 ఏండ్లు నిండిన మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరెలను పంపిణీ …
Read More »