తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. హైదరాబాద్లోని మూడు చోట్ల ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. …
Read More »మాజీ మంత్రి నాయిని మృతి
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 28న కరోనా సోకడంతో బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో నాయిని చేరారు. కరోనా తగ్గిన తర్వాత మళ్లీ వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. న్యుమోనియా తలెత్తడంతో సిటీ న్యూరో సెంటర్ …
Read More »తొలి హోం మంత్రిగా నాయిని చరిత్రలో నిలిచిపోతారు
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యమ నేతగా, జన నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా అందరి మనస్సుల్లో నిలిచిపోతారని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నాయిని మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫొటోలను ట్విటర్లో ఫొటోలు షేర్ …
Read More »జొన్న రొట్టే, కోడి మాంసం అంటే నాయినికి మస్త్ ఇష్టం
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి జొన్నరొట్టే, కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఈ రెండింటి కాంబినేషన్ చిన్నప్పటి నుంచే ఆయనకు అలవాటు. అది ఇప్పటి వరకూ కొనసాగింది. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో జొన్నరొట్టె, కోడి మాంసం వండాల్సిందే. ఈ వంటకాన్ని నాయిని అతి ఇష్టంగా తినేవారు. బేగంబజార్ జిలేబీ అంటే మహా ఇష్టం. ఇక పాతబస్తీలోని బేగంబజార్కు నాయినికి ఎంతో అనుబంధం ఉంది. సోషలిస్టు ఉద్యమాలు చేసిన సమయంలో …
Read More »భాగ్య నగర ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు రూ.550 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో భరోసా దక్కిందని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. వరదలతో ప్రజలు అవస్థ పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై హైదరాబాద్వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Read More »రైతు సంక్షేమమే సర్కారు లక్ష్యం
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్ సుధాకర్రెడ్డి ఇటీవల మరణించాడు. ఆయన భార్య కొలన్ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ, రైతుబంధు …
Read More »కాంగ్రెస్సోళ్ల మాటలను నమ్మే స్థితిలో దుబ్బాక ప్రజలు లేరు
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు?.. రైతులకు కరెంట్ ఇవ్వక మోసం చేసినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకా?.. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినందుకా?.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూపాయి ఇవ్వనందుకా?’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా ఉత్తమ్కుమార్రెడ్డి?.. మీ మాటలు కాయకొరుకుడు మాటలు.. మీ …
Read More »తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ దిమ్మతిరిగే షాక్
బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛన్లో కేంద్రప్రభుత్వమే రూ.1,600 ఇస్తున్నదంటూ కమలనాథులు గోబెల్స్ను మించి ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం అందించే పింఛన్లతోపాటు, కేసీఆర్ కిట్లకిచ్చే డబ్బంతా కేంద్రానిదే అన్నట్టు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల పేరుతో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ‘బీజేపీనేతలు చేస్తున్న ప్రచారం వాస్తవమైతే, వారు దుబ్బాక బస్టాండ్ సెంటర్కు వచ్చి ప్రజల మధ్య నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే …
Read More »మాజీ మంత్రి నాయినికి మంత్రి కేటీఆర్ పరామర్శ
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు పరామర్శించారు. సోమవారం జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి వెళ్లి నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలని కేటీఆర్ డాక్టర్లను కోరారు.
Read More »గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటంతో బాధితులను ఆదుకొనేందుకు నేనున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమి చ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సోమవారం తెలిపారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వర్షాలు, వరదల …
Read More »