గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేయవచ్చునని, ఈ పరిమితిని మించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. పాలక మండలి గడువు ముగిసే ఫిబ్రవరి 10వ తేదీ లోగానే ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. ఈసీ కార్యాలయంలో గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్తోపాటు నగరం పరిధిలోకి వచ్చే జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. వార్డులవారీగా ఓటరు …
Read More »సీఎం కేసీఆర్ పాలన..బీసీలకు స్వర్ణయుగం: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రంలోని బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు యాభైశాతం సీట్లంటూ కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లపై కోర్టుకు వెళతామనడం.. ఎన్నికల నుంచి కాంగ్రెస్ పారిపోయిందనేందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. కేసీఆర్ పాలన బీసీలకు స్వర్ణయుగమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలను నిలబెట్టిన ఘనత తెరాసదేనన్నారు. కుల …
Read More »ధరణి సరికొత్త విప్లవం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నది. భూక్రయవిక్రయాలు.. సమస్యలతో రైతన్న ఎక్కడా.. ఎలాంటి ఇబ్బందికీ లోనుకాకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని సాకారంచేస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. కనీస పరిజ్ఞానముంటే ఇంటినుంచే భూక్రయవిక్రయాలను నిర్వహించుకొనే సౌలభ్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎవరైనా సరే భూమి కొనుగోలుకు ముందుగా అది వివాదాల్లో ఉందా? లేదా? ఏమైనా కేసులున్నాయా? లేవా? వారి వారసులు …
Read More »ఇండ్లు లేని వారందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి
నిరుపేదలైన ఎస్సీలకు రైతుబంధు, బీమాలకు ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.ఎస్సీల ప్రత్యేక నిధి,ఉప ప్రణాళికల ద్వారా అమలవుతున్న పథకాలు,కొత్తగా ప్రవేశపెట్టాల్సిన కార్యక్రమాల గురించి సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఎస్సీల సర్వతోముఖాభివృద్ధికి మరింత మెరుగైన ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ …
Read More »‘సంధ్య’ స్పూర్తితో మైనింగ్ రంగంలోకి మహిళలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
దేశంలోనే తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్లో సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన సంధ్య.. మహిళలకు మైనింగ్ రంగంలో అవకాశాలు కల్పించాలని కొట్లాడిన ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం, ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. “సంధ్య రసకట్ల, …
Read More »తెలంగాణలో మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్.శంకర్, వంశీకృష్ణ, సురేందర్రెడ్డి నియామకమయ్యారు. తాండూరు మున్సిపల్ కమిషనర్గా జీ శ్రీనివాస్రెడ్డి, నార్సింగి మున్సిపల్ కమిషనర్గా సత్యబాబు, కొల్లాపూర్కు విక్రమసింహారెడ్డి, దేవరకొండకు వెంకటయ్య, భువనగిరికి పూర్ణచందర్రావు, జనగామకు సమ్మయ్య, నేరేడుచర్లకు గోపయ్య, తిరుమలగిరికి డీ శ్రీనివాస్, జహీరాబాద్కు సుభాష్రావు, నర్సాపూర్కు అశ్రిత్కుమార్, చేర్యాలకు రాజేంద్రకుమార్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీడీఎంఏ …
Read More »ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబుకు కరోనా
తెలంగాణ రాష్ట్రంలోనిమంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్ రిపోర్ట్లో పాజిటివ్గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
Read More »హైదరాబాద్ తూర్పులో ఐటీ విస్తరణకు చర్యలు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో నైట్ ఫ్రాంక్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ స్పెషల్ రిపోర్టును కూడా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా …
Read More »మోహిదీపట్నం స్కైవాక్కు మంత్రి కేటీఆర్ ఆమోదం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్ను అద్భుతంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దుర్గం చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది..!
దుబ్బాక ఉప ఎన్నికలో ఇప్పటికే రెండు సార్లు ఫీల్డ్ సర్వే చేసిన సీపీఎస్ టీమ్…పోలింగ్ రోజు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్ 47.4% బీజేపీ 35.3% కాంగ్రెస్ 14.7% శాతం, ఇతరులు 2.6% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని సీపీఎస్ టీమ్ అంచనా వేసింది. …
Read More »