హైదరాబాద్లోని పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే 199 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది..ఈ రోజు గురువారం నుండి మరో 24 అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఉపసభాపతి పద్మారావుతోపాటు.. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. కొత్తగా కాచిగూడ, పార్శీగుట్ట, కుత్బుల్లాపూర్, గూలిపూర, మలక్పేట్, కవాడిగూడ పరిధిలో ప్రారంభంకానున్నాయి. దూల్పేట్, ఎర్రగడ్డ, …
Read More »గ్రీన్ చాలెంజ్ లో అందాల భామలు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియాచాలెంజ్ సినీరంగంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతోంది. భూమాతకు పచ్చటి రంగులను అద్దాలనే ఈ మహాకార్యంలో మేముసైతం అంటూ సినీ తారలు భాగస్వాములవుతున్నారు. మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఇండియాచాలెంజ్లో కథానాయిక రకుల్ప్రీత్సింగ్ పాల్గొన్నది. హీరో నాగచైతన్య చాలెంజ్ను స్వీకరించిన ఆమె బుధవారం జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలను నాటింది. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్ను …
Read More »ఇప్పటికి ధరణి రిజిస్ట్రేషన్లు 12,705
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరందుకుంటున్నది. ధరణి పోర్టల్కు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కేవలం 10 రోజుల్లోనే 12,705 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 8,488 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కాగా, బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 12,705కు చేరుకున్నది. అంటే రెండ్రోజుల్లోనే 4,217 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడ్రోజులుగా సగటున రెండువేలకు మించి రిజిస్ట్రేషన్లు, …
Read More »మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు
మాసాయి పేట వద్ద జాతీయ రహదారి వద్ద ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ..బైక్ స్క్రిడ్ అయి కింద పడ్డారు.. ఈ సమయంలో దౌల్తాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు గారు కింద పడిపోయిన ఇద్దరి యువకులను గమనించి కారులో ఆపి దిగారు… జరిగిన సంఘటనను అడిగి తెలుసుకొని.వారికి గాయాలను గుర్తించి అక్కడ ఉన్న ఎస్ ఐ గారి కి చెప్పి ఆసుపత్రి చేపించారు.. ఇద్దరి …
Read More »“ది అరవింద్ షో” రూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలో టిఆర్ యస్ పార్టీ నగర అధ్యడు కమర్తపు మురళి కి చెందిన అరవింద్ బ్రాండెడ్ షోరూం ఇల్లెందు క్రాస్ రోడ్డు కరెంట్ ఆఫీస్ ఏదురగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడూతూ జిల్లా వాసులకి నాణ్యమైన దుస్తులు అందించే అరవింద్ షోరూం స్థాపించిన మురళికి శుభాకాంక్షులు తెలిపారు.నూతన వస్తాల కోనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని …
Read More »ఆరేండ్లలో 28 వేల పోలీసు నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఆరేండ్లలో దాదాపు 28వేల మంది పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని.. సాంకేతికత, ఫ్రెండ్లీ పోలీసీంగ్తో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజాభద్రత, రక్షణకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్.. పోలీసుశాఖకు అనేక వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్లో ఏర్పాటుచేసిన …
Read More »దక్షిణకొరియా కంపెనీలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం
తెలంగాణలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకు రావాలన్నారు. ఈ పార్క్లో సకల సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. భారత్-కొరియా బిజినెస్ ఫోరం బుధవారం ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎ్సఐపాస్ విధానం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిందని గుర్తుచేశారు. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికలు- అదే టీఆర్ఎస్ కొంపముంచింది..!
తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు కారును పోలిన గుర్తును కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 3,489 ఓట్లు పడ్డాయి. దీంతో కొంతమంది దుబ్బాక ఓటర్లు పొరపాటుగా అతనికి ఓటు వేసి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్ రావు
దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు ప్రజా తీర్పును శిరసావహిస్తామని..టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి.. ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల్లోనే ఉంటామన్న హరీశ్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
Read More »ఫలితాలపై సమీక్షించుకుంటాం:మంత్రి కేటీఆర్
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.
Read More »