Home / Tag Archives: telanganacmo (page 374)

Tag Archives: telanganacmo

GHMC Results Update-ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్ల‌కు గానూ ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత‌, యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ గెలుపొంద‌గా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పుష్ప న‌గేశ్ విజ‌యం సాధించారు. డ‌బీర్‌పురా, మెహిదీప‌ట్నం డివిజ‌న్ల‌లో ఎంఐఎం, …

Read More »

GHMC Results Update-మీడియాకు అనుమతివ్వండి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ పలు కౌంటింగ్ సెంటర్ల వద్దకు మీడియాను అనుమతించని పరిస్థితి ఏర్పడింది. కౌంటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారాన్ని పలువురు మీడియా ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు మీడియా ప్రతినిధులకు …

Read More »

GHMC Results Update-ఓల్డ్ బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌య్యింది. మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. డిసెంబ‌ర్ 1న జ‌రిగిన పోలింగ్‌లో 34,50,331 మంది త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. ఇందులో 1926 పోస్ట‌ల్ ఓట్లు పోల‌య్యాయి. డివిజ‌న్ల‌వారీగా ఆయా పార్టీల‌కు పోలైన ఓట్ల వివ‌రాలు.. కుక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్‌.. ఓల్డ్‌బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌- 17 (టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్ల‌నివి రెండు ఓట్లు) …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్నమంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం మొదలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. దయచేసి అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. …

Read More »

జీహెచ్‌ఎంసీ పోలింగ్ అప్డేట్.. ఓటు వేసిన సినీ ప్రముఖులు వీళ్ళే

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు మంగళవారం ఉదయం ప్రారంభమైయాయి.మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. * మెగాస్టార్‌ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కును వియోగించుకున్నారు * ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు వేశారు. * …

Read More »

టీఅర్ఎస్ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నాయకుడు,నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్శ్జింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మంగళవారం తెల్లారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అపోలో అసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నకిరేకల్ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఆయన నకిరేకల్ …

Read More »

హైదరాబాద్ లో ఆరేండ్లలో 67వేల కోట్ల అభివృద్ధి

‘ఎన్నో స్కీంలు.. మరెన్నో కట్టడాలు.. ఇంకెన్నో అద్భుతాలు.. ఈ ఆరున్నరేండ్ల తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు.. కాస్మొపాలిటన్‌ నగరం అనువైన మౌలిక సదుపాయాలతో నగిషీలు దిద్దుకొన్నది.  అభివృద్ధి గురించి మాటలు చెప్పడమే కాదు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించింది. ఒక్కసారి భాగ్యనగరాన్ని నలువైపులా వీక్షిస్తే చాలు అభివృద్ధి అంటే ఎంటో అవగతమవుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్‌లో ఆవిష్కృతమైన అద్భుతాల్లో కొన్ని…  నమస్తే తెలంగాణ …

Read More »

గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్‌ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్‌ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. హైదరాబాద్‌ ఆగమైతే భూముల, ఆస్తుల విలువలు పోతయని, వ్యాపారాలు బందైతయని, పిల్లలకు ఉద్యోగాలు రావని అన్నారు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ …

Read More »

తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,69,223కు చేరింది. 1,455 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,490 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం …

Read More »

ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం : మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పించినట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధిని జోడెడ్లులాగా సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ర్టాన్ని ఎవరు ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat