టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్కు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. థ్యాంక్యూ అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్కు ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా జీవితంలో మీరు నాకు అమూల్యమైన బహుమతి అన్నయ్య అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
Read More »వరద సాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లొద్దు : GHMC కమిషనర్
వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం …
Read More »నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 55 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల విధులు, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మేయర్ పదవిపై ఎలాంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించనున్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి …
Read More »తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,73,341కు కరోనా కేసులు చేరగా 1,472 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,125 యాక్టివ్ కేసులు ఉండగా 2,63,744 మంది రికవరీ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 104 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.
Read More »టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారితో కలిసి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. …
Read More »గ్రేటర్ పోరులో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్
బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. …
Read More »ఆశించిన ఫలితం రాలేదు : మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వచ్చిన స్థానాలకు అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వెల్లడి అయింది. 10 -15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి …
Read More »భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరుల్లో భారీ మెజార్టీ
సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ గులాబీ గుబాళించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ మూడు డివిజన్లలో 4 నుంచి 6వేలకు పైగా ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు వచ్చింది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్రావు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీలు …
Read More »మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1968లో కాంగ్రెస్ …
Read More »