తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ పెంచిన హమాలీల ఛార్జీలు 2021 జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు
Read More »తెలంగాణలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.
Read More »తెలంగాణలో విద్యా వాలంటీర్ల నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో.. 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు …
Read More »రండి చేయి చేయి కలుపుదాం-ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించిన సంతోష్.హరిత వందనాలు వాస్తవాలను ప్రజల కళ్లముందుంచుతూ.. మంచిని వివరిస్తూ.. చెడును ఎత్తిచూపుతూ సమాజాన్ని చైతన్య పరచడంలో మీడియా పాత్ర వెలకట్టలేనిది. సమాజం పట్ల, పౌరుల హక్కుల పరిరక్షణ పట్ల మీ నిబద్దత ఎల్లప్పుడూ …
Read More »కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం-మహారాష్ట్ర మంత్రి విజయ్ ఓడేటివార్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విజయ్ ఓడేటివార్ కొనియాడారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో జీఆర్ఆర్ కాటన్ మిల్లును ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విజయ్ ఓడేటివార్ మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల …
Read More »సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్
సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్ నిర్మింప చేసేందుకు, స్థానిక పాత బస్టాండ్ ఆధునీకరణ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసీ అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను …
Read More »ఆ ఘనత సీఎం కేసీఅర్ దే..
ఒకవైపు సంక్షేమంలో మరోవైపు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తొక్కేయాలని చూస్తు న్నా, రాష్ట్రాభివృద్ధికి అవార్డులు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. శనివారం బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సీఎం కేసీఆర్ విధానాలపై ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ …
Read More »గ్రేటర్ మేయర్ మద్ధతుదారులకు రూ.6లక్షలు జరిమానా
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొత్త మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 …
Read More »స్త్రీ నిధి పథకం ద్వారా మహిళలకు అండ
తెలంగాణ రాష్ట్రంలో పాలకొరతను అధిగమించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున బర్రెలు, ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. స్త్రీనిధి పథకం ద్వారా సుమారు రూ.800 కోట్ల రుణాలతో రెండేండ్లలో పాడిరైతులకు లక్ష బర్రెలు, ఆవులు అందించనున్నది. ఇప్పటికే 14 వేల బర్రెలు, ఆవుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించింది. రుణాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50వేల యూనిట్లను పాడిరైతులకు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. కరోనా ప్రభావంతో ఆటంకాలు …
Read More »YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే …
Read More »