2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. దీనిపై మార్గదర్శకాలను విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ శుక్రవారం విడుదలచేశారు. మార్గదర్శకాలు.. విద్యాశాఖ విడుదల చేసిన ప్రొఫార్మా ప్రకారం టీచర్లు, సిబ్బంది ముందుగా తాము …
Read More »టీఆర్ఎస్ కెవి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఫేస్-5 లో ఆంధ్రపాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కెవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు …
Read More »లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనుండగా.. లక్ష మందితో సభను నిర్వహించేందుకు TRS శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్ఎస్ …
Read More »రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …
Read More »తెలంగాణలో కొత్తగా 1,914 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,914 మందికి పాజిటివ్గా తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,734కు చేరుకున్నది. 11,617 మంది దవాఖానలు, హోంఐసొలేషన్లో చికిత్స పొందుతున్నట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 393, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 205 వెలుగుచూశాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, …
Read More »టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం (టిడిఎల్పీ), టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో పూర్తిస్థాయిలో విలీనం అయింది. ఇందుకు సంబంధించిన బులెటిన్ ను బుధవారం శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు అధికారికంగా విడుదల చేశారు.తమను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయమని టీడీఎల్పీ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర్ రావులు చేసుకున్న వినతిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అదే సమయంలో తాము వారి విలీనానికి అంగీకారం …
Read More »కంటతడిపెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి..ఎందుకంటే..?
అనుంగ అనుచరుడు, నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దివంగత కర్నాటి విజయభాస్కర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మంత్రి జగదీష్ రెడ్డి కన్నీటిపర్యంతంగా విలపించారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈ సాయంత్రం పెద్దవూర మండల కేంద్రంలో టి ఆర్ యస్ పార్టీ ధూమ్ ధామ్ ను నిర్వహించింది. ఈ సభకు మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్,ప్రభుత్వ విప్ …
Read More »ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు
ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సేవింగ్ లైఫ్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగించారు. భారత కాలమానం ప్రకారం నిన్న అర్ధరాత్రి తర్వాత జపాన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. …
Read More »మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన : మంత్రి కేటీఆర్
నానక్రామ్గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ ట్రానిక్.. రూ. 1200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ …
Read More »