అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ కుల వృత్తుల వారికీ 1లక్ష రూపాయలు చెక్కుల పంపిణి కార్యక్రమాని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం సార్ గారు మరియు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా అయిజ మండలం ముస్లిం మైనార్టీలకు సంకాపురం రాముడు గారి సహకారంతో ముస్లిం మైనార్టీ కుల వృత్తుల 1లక్ష రూపాయలు చెక్కును అలంపూర్ …
Read More »గద్వాల కాంగ్రెస్ లో విబేధాలు
తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్ పర్శన్ సరితకు ఆ పార్టీలో షాకిచ్చారు నేతలు. సరితకు ఈ నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ,ముఖ్య నేతల సమావేశంలో తీర్మానించారు. ఇది మరవకముందే సరిత అభ్యర్థిత్వాన్ని …
Read More »ఉచితంగా మట్టి గణపతులు
తెలంగాణ వ్యాప్తంగా మట్టి గణపతులను అందజేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు. పాస్టర్ ఆఫ్ ప్యారిస్ ,కెమికల్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల జలాశయాలు.. చెరువులు కాలుష్యమవుతాయని ఆయన తెలిపారు. ఈ …
Read More »తెలంగాణలో కోటి ఎకరాలు దాటిన సాగు
తెలంగాణ రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గత వానకాలంలో ఇదే సమయానికి 95 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 7 లక్షల ఎకరాలు అధికంగా సాగయ్యాయి. అత్యధికంగా పత్తి 44.57 లక్షల ఎకరాల్లో వేయగా, ఆ …
Read More »సిహెచ్ ఎంవీ కృష్ణారావు మృతికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకులు సిహెచ్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. జర్నలిజంలో కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన …
Read More »సీనియర్ జర్నలిస్ట్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సిఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన …
Read More »కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోభారీ చేరికలు…
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుండి బలబత్తుల రమేష్,బండారి రమేష్,ఎండి వలీల్ మొహమ్మద్,మంద అనిల్, తీగల చంటి,తీగల రమేష్,మంగళ చంద్రమౌళి, జన్ను వినయ్,పురుషోత్తం చారి తదితరులు నేడు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా 23వ డివిజన్ మాజి కార్పొరేటర్ …
Read More »ఈనెల 20న సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 20న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అదే రోజు జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Read More »సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పంతోమ్మిది తారీఖున మెదక్ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే ఈ పర్యటన ఈ నెల ఇరవై మూడో తారీఖుకు వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పంతోమ్మిదో తారీఖున ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేయడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ఆసియాలోనే ప్రతిష్టాత్మక మార్కెట్ గా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ : మంత్రి జగదీశ్రెడ్డి
ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ‘సూర్యాపేట టైమ్స్’తో చెప్పారు. ఆసియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగిందని, ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారన్నారు. ఈ మార్కెట్ యార్డు నిర్మాణంలో ప్రతి దశను తాను స్వయంగా పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు …
Read More »