ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) రిజల్ట్ అప్డేట్స్౼(31/60). 1: తేజావత్ హుస్సేన్(TRS) 2: మలీదు వెంకటేశ్వర్లు(CONGRESS) 3: మలీదు జగన్(INDEPENDENT) 4: దండా జ్యోతి రెడ్డి(TRS) 7: దొంగల సత్యనారాయణ(BJP) 8: లకావత్ సైదులు(CONGRESS) 9: SK జాన్ బీ(TRS) 10: చావా మాధురి(ఏకగ్రీవం-TRS) 13: కొత్తపల్లి నిరజ(TRS) 14: కురాకుల వలరాజు (TRS) 15: రావూరి కరుణ(TRS) 19: చామకూర వెంకన్న(CPI) 20: బిక్కసాని ప్రశాంత లక్ష్మి ( TRS) …
Read More »జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్ఎస్ జెండా
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్ఎస్ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన …
Read More »కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో …
Read More »నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 1వ వార్డ్ — ఇండిపెండెంట్ విజయం బిక్షం రెడ్డి 2వ వార్డ్ —TRS విజయం సునీల్ 3వ వార్డ్ — TRS విజయం చింత స్వాతి త్రిమూర్తులు 4వ వార్డ్ — CONGRESS విజయం గాజుల సుకన్య 5వ వార్డ్ — LION విజయం వంటేపాక సోమలక్మి 6వ వార్డ్ — TRS విజయం మంగినిపల్లి ధనమ్మ (రాజు) …
Read More »నకిరేకల్ ఏడు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1వ వార్డులో కందాల బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) గెలుపొందాడు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సుకన్య గెలుపొందింది. 8వ వార్డులో కందాల పావని శ్రీనివాస్ రెడ్డి(స్వతంత్ర) అభ్యర్థి గెలుపొందారు. నకిరేకల్ పురపాలికలో మొత్తం 20 వార్డులు …
Read More »అచ్చంపేటలో ఖాతా తెరిచిన కారు..
అచ్చంపేట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 13, 16 వార్డులను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. 4 వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్లతో, 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్ …
Read More »సిద్దిపేట పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 91 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పొలవ్వగా దీంట్లో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన ఓట్లలో టీఆర్ఎస్కు 44, బీజేపీకి 2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇందూర్ ఇంజినీరింగ్ …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ ఘన విజయం
నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ …
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి హోరు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య …
Read More »