Home / Tag Archives: telanganacmo (page 322)

Tag Archives: telanganacmo

తొలగుతున్న ముసుగులు!

రాజు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనప్పుడు ద్రోహులందరూ ఒకచోట చేరతారని చాణక్య సూక్తి. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అని ప్రకటించుకున్న ఈటల ఆ మాట మరిచి, మాటను మార్చి కాషాయ నీడలో సేదదీరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాషాయ తీర్థం సేవించడం కోసం ఆయన బీజేపీ నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని, కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారట. ఒప్పందాలున్న చోట షరతులూ ఉంటాయి. మరి బీజేపీ ఏమి షరతులు విధించిందో, ఈటల షరతులేం పెట్టారో …

Read More »

తెలంగాణలో 93కోట్ల చేప పిల్లల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 28 వేలకుపైగా నీటివనరుల్లో రూ.89 కోట్లతో 93 కోట్ల చేపపిల్లలు, రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలు వేయనున్నట్టు తెలిపారు. చేపపిల్లల పంపిణీపై మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. మత్య్ససంపద పెంచడంతోపాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ చేప పిల్లల పంపిణీకి …

Read More »

ఫంగస్ కు భయపడకండి ..నేనున్నా అంటున్న కిషన్ రెడ్డి

“ఫంగస్ మందు Ampoterisan ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయి. మన దేశానికి చెందిన 11 కంపెనీలు ఈ ampoterisan ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతుంది.వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి.నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి.జూ.డాల కోరికలు న్యాయమైనవే. జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.కరోన తగ్గినా దీర్ఘకాలిక …

Read More »

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు

తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.

Read More »

కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు BRK భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీపై CS సోమేశ్కుమార్, అధికారులతో చర్చించారు. సూపర్ సైడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలోనే వారికి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా చూడాలన్నారు.

Read More »

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికం

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికంగా తయారైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయనే అంచనా ఉందన్నారు. ఇందుకుగాను 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతున్నాయని, రాష్ట్రంలో 18.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. వారికి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి పంటలు సాగుచేయాలని సూచించారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 23 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,60,141కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,169 మంది మరణించారు. కొత్తగా 4,298 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,18,266కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 537 నమోదయ్యాయి.

Read More »

కొవిడ్ వ్యాక్సినేష‌న్.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కొవిడ్ వ్యాక్సినేష‌న్ విష‌యంలో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 28 నుంచి సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ముందుగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారులు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీల‌కు టీకాలు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే కొవిడ్ వ్యాక్సినేష‌న్‌పై మంత్రి హ‌రీష్ రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సూప‌ర్ స్ర్పెడ‌ర్ల‌కు టీకాలు …

Read More »

కరోనా కట్టడీపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.

Read More »

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat