Home / Tag Archives: telanganacmo (page 321)

Tag Archives: telanganacmo

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు

క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. నేటితో ముగియ‌నున్న లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం పొడిగించింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్ణ‌యం తీసుకున్న‌ది. జూన్ 9వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. నేటి వ‌ర‌కు రోజుకు 4 గంట‌లు మాత్ర‌మే మిన‌హాయింపు ఇవ్వ‌గా, ఆ స‌మ‌యాన్ని మ‌రో మూడు గంట‌ల పాటు పొడిగించారు. ఇక ప్ర‌తీ …

Read More »

నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం

నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? ‘మీకు వ్యవసాయం వస్తదా?’ అని ప్రశ్నించిన నోళ్లతోనే.. ‘మీకే వ్యవసాయం వస్తదని’ చెప్పించాలంటే ఎంత …

Read More »

తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా లాక్‎డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్‎డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని …

Read More »

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పువ్వాడ అండ

ఆర్టీసీ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసాగా నిలుస్తున్నారు. క్లిష్ట సమయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజయ్..ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో సూచించిన బాటలో పయనిస్తూ ఆర్టీసీలో రవాణా శాఖ లో సంచలనాత్మక కార్యక్రమాలు మొదలు పెట్టారు పార్సిల్ కొరియర్ కార్గో సర్వీస్ పై సీఎం చేసిన సూచనలను తక్షణమే ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాలు సాధించే దిశగా దానిని మలిచేందుకు కు కృషి …

Read More »

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్రాజెక్టుల పురోగ‌తిపై మంత్రి జగదీష్ సమీక్షా

ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో కొత్త‌గా నిర్మించ త‌ల‌పెట్టిన లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాల‌ని మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్రాజెక్టుల పురోగ‌తిపై న‌గ‌రంలోని జ‌ల‌సౌధ‌లో మంత్రి శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యేలు గాద‌రి కిశోర్‌, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీపీఆర్‌లు పూర్తి చేసి స‌త్వ‌ర‌మే నిర్మాణాలు చేప‌ట్టాల‌న్నారు. సూర్యాపేట జిల్లా ఎస్సారెస్పీ …

Read More »

నర్సంపేటలో మోడల్ వెజిటేబుల్ మార్కెట్ భవనం

తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రూ.2 కోట‌్లవ్యయంతో నిర్మించిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ భవనాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ …

Read More »

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవఖానాలపై కొరడా

క‌రోనా సంక్షోభంలో డ‌బ్బే ప‌ర‌మావ‌ది కాకుండా మానవతాదృక్పథంతో వ్య‌వ‌హరించి రోగుల‌కు చికిత్స అందించాల్సిందిగా ప్ర‌భుత్వం ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసింది. అయినా పెడ‌చెవిన పెట్టి కొవిడ్ చికిత్స‌కు ఇష్టానుసారం అధిక ఫీజులు వ‌సూళ్లు చేస్తున్న ప‌లు ప్రైవేటు ఆస్ప‌త్రులపై ప్ర‌భుత్వం తాజాగా కొర‌డా ఝుళిపించింది. ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు 64 ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వైద్యారోగ్య‌శాఖ‌ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన ఆస్ప‌త్రుల …

Read More »

జీహెచ్ఎంసీలో తొలిరోజు 21, 666 మందికి టీకా

 గ్రేటర్‌ హైదరాబాద్‌లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. హైరిస్క్‌ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు. ముందస్తుగా 30 వేల మందికి టోకెన్లు అందించగా.. 21,666 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వీరిలో 44 ఏండ్లలోపు వయస్సువారు 15,963 మంది, 45 ఏండ్లు పైబడివారు 5,703 మంది ఉన్నారు. మొదటి …

Read More »

రాజ‌య్య కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఎంఈవో మంకు రాజ‌య్య మ‌ర‌ణ వార్త విని దిగ్భ్రాంతికి గురైన‌ట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్ర‌వారం రాజ‌న్న సిరిసిల్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మంత్రి రాజ‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ‌న్న చివరి శ్వాస వరకు విద్య కోసం పని చేశార‌ని కొనియాడారు. ఇటీవలే ఎడ్యుకేషన్ సబ్ కమిటీ స‌మావేశం రోజు …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు.

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat