మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి చెల్లని పైస గా మారిపోయింది. తనను తాను ఓ బడా నాయకుడిగా ఊహించుకొన్న ఆయన పతార ఏపాటిదో ఢిల్లీలో తేలిపోయింది. బీజేపీలో చేరడానికి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటలను ఆ పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోనేలేదు. అగ్రనేత అమిత్షా మా ట దేవుడెరుగు.. కనీసం ముందుగా అనుకున్న ప్ర కారం రావాల్సిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. …
Read More »తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 1.40 శాతం
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియా ద్వారా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. లాక్డౌన్ ప్రారంభంలో 90 శాతమున్న రికవరీ రేటు ప్రస్తుతం 96 శాతానికి పెరిగిందన్నారు. ఈ వారంలో పాజిటివిటీ రేటు 1.40 శాతంగా ఉందన్నారు. ఫీవర్ సర్వే, కొవిడ్ ఓపీ వల్ల కరోనాను నియంత్రించగలిగినట్లు తెలిపారు. 16.74 లక్షల మంది హైరిస్క్ గ్రూపు …
Read More »సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని కోర్టు కూడలిలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటల 45 నిమిషాలకు నల్లగొండ జిల్లాలోని …
Read More »మంత్రి కేటీఆర్ ఔదార్యం
కరోనాతో తండ్రి మరణించగా, ఓ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారిని ఆదుకోవాలంటూ చేసిన ట్వీట్కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ముగ్గురి పిల్లల పట్ల ప్రత్యేక చొరవ చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులపూర్ గ్రామానికి చెందిన భూసి సత్తయ్య గత 2 నెలల క్రితం గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. సత్తయ్యకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ …
Read More »నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు రూ.31 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్తు సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదని అన్నారు.ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా అన్ని …
Read More »యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి కొత్తగా నిర్మితమవుతున్న కట్టడాలను పరిశీలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సియం కేసీఆర్ సంకల్పంతో యాదగిరిగుట్ట పునఃర్నిర్మాణం …
Read More »తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు.
తెలంగాణ కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,03,369కి పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 5,78,748 మంది కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 21,137 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,484కు చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా …
Read More »ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
తెలంగాణలో వానకాలం రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానున్నది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సీజన్కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందుతుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు …
Read More »రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ
తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదును జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదికి మొత్తం 63,25,695 మందిని అర్హులుగా గుర్తించామని వివరించారు. కొత్తగా 66,311 ఎకరాలకు రైతుబంధు వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. 150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు అవసరమని చెప్పారు. గతేడాది రెండు సీజన్లకు కలిపి రూ.14,656.02 కోట్లు పంపిణీ చేయగా.. …
Read More »పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ముగిసిన సీఎం KCR సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం నూతన కార్లను …
Read More »