బీజేపీ ఓ చెత్త పార్టీ అని, వరంగల్కు అభివృద్ధి వరాలు కురిపించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో దయాకర్రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న …
Read More »రైతుబంధు సాయం రైతుకే ఇవ్వాలి-బ్యాంకర్లకు మంత్రి హారీష్ ఆదేశం
తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో …
Read More »తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి
గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్లైన్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కొనియాడారు. మంగళవారం ఆయన రాష్ర్టాల ఆడిట్, ఆర్థిక, పంచాయతీరాజ్ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ఆడిట్పై తెలంగాణ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రశంసించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆన్లైన్ …
Read More »పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు
మురికివాడల స్థానంలో పేదలకు ఆత్మగౌరవంతో జీవించే ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సీఎం కేసీఆర్ కల సాకారమైందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని పొట్టి శ్రీరాములు నగర్ బస్తీ లో కార్పొరేటర్ కే.హేమలత, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారీ, తాసీల్దార్ బాలశంకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌసింగ్ ఈఈ ఎం.వెంకట్దాస్రెడ్డి, జలమండలి …
Read More »తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం
తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. సుల్తాన్పూర్లో రూ.12 లక్షలతో పైపులైన్, బాలాజీనగర్లో రూ.12 లక్షలతో డ్రైనేజీ పైపులైన్, మల్లాపూర్లో రూ.21 లక్షలతో ఓపెన్ జిమ్, రూ.31 లక్షలతో మల్లాపూర్లో ఎంఆర్సీ బిల్డింగ్, ఆనంద్నగర్లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పైప్లైన్, వెంకటాపూర్లో రూ.12.50 లక్షలతో బాత్ రూమ్స్, …
Read More »కాళేశ్వరం అద్భుతఘట్టం డిస్కవరీ డాక్యుమెంటరీగా రాబోతుంది..!
కాళేశ్వరం… తెలంగాణ మణిహారం. ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గో‘దారి’నే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది. ఇది సీఎం కేసీఆర్.. ఇంజనీరింగ్ నిపుణుల కృషికి.. యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణంగా …
Read More »టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత ముద్దసాని కశ్యప్రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కశ్యప్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలో హుజురాబాద్లో జరిగే సభలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరుతారని చెప్పారు. హుజురాబాద్ …
Read More »ఆదర్శంగా రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, టెక్స్టైల్స్పార్కు నుంచి డబుల్బెడ్రూంఇండ్లకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి నిర్మాణం తదితర పనులను పరిశీలించిన ఆయన నర్సింగ్ కళాశాల …
Read More »యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …
Read More »వరంగల్ జిల్లాలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
వరంగల్ అర్బన్ జిల్లా పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతామని సీఎం పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ ప్రారంభించుకున్న కలెక్టరేట్ భవనాన్ని హన్మకొండ జిల్లాగా పరిగణించాలి. దీనికి సమీపంలో నిర్మించబోయే …
Read More »