తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు గారి దంపతులను, సినీనటుళ్లు నందమూరి తారక రామ రావు గారిని , మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కల్సిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పువ్వాడ నయన్ తో …
Read More »తెలంగాణపై కేంద్రానికి జగన్ పిర్యాదు
తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా …
Read More »సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలతో కలెక్టర్ కృష్ణభాస్కర్ను కూర్చిలో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అంతకుక్రితం సీఎం సర్దాపూర్లో మార్కెట్యార్డును, సిరిసిల్లలో నర్సింగ్ …
Read More »తెలంగాణలో పల్లెలు ప్రగతి తొవ్వబట్టినయ్-Telangana Vijay Editorial
పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది..గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది. అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది.గోసరిల్లిన పల్లెల గోసతీరింది.ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్ ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ కనపడ్డది..పల్లెలు ప్రగతి బాటపట్టినయ్..అభివృద్ధికి తొవ్వ జూపినయ్.. నాడు ఊరు అంటే సర్కారీ తుమ్మలతో స్వాగతం పలికే చెరువులు.. దుమ్మూధూళీ గుంతలతో కూడిన రోడ్లు, చివరకు మరణించిన వారికి అంత్యక్రియలు సక్కగా చేయలేని దుస్థితిలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా …
Read More »బాలానగర్ ఫ్లై ఓవర్ సిద్ధం- రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ డివిజన్లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి. పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. అంతగా ఉంటుంది రద్దీ. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మించారు. రయ్ రయ్న …
Read More »ఉమ్మడి కరీంనగర్లో ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలి- సీఎం కెసిఆర్
గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలన సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తేల్చి చెప్పారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు …
Read More »సిరిసిల్ల వేదికగా సీఎం కేసీఆర్ వరాల జల్లు
సిరిసిల్లలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.. ? కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు ? గొర్రెల పంపిణీ కి ఎనిమిది వేల కోట్లు.. ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ? ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించాం ? సన్యాసులకు ఎప్పుడు అనుమానాలు ఉంటాయి ? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా …
Read More »సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్కు అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. …
Read More »ఐడీటీఆర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు చేరుకున్నారు. మొదట తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, …
Read More »కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు-సీఎం కేసీఆర్
కృష్ణా జలాలను వృథా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ వాడుకోవచ్చని.. తెలంగాణకు కేటాయించిన నీటితోనే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి గోస తీరిందని, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జల విద్యుత్ అవసరం పెరిగిందన్నారు.
Read More »