కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకోబోమని, న్యాయమైన వాటా దక్కేవరకు పోరాడుతామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఒకఏడాదిలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ఏడేండ్లుగా నాన్చుతు న్నదని మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన రాజకీయ పరిస్థితులు- కర్తవ్యాలు’ అనే అంశంపై దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి హరీశ్రావు …
Read More »సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు రాష్ట్ర క్యాబినేట్ సమావేశం
ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణ జలాల వివాదం, తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చకు రానున్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన ఖాళీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు సమగ్రమైన నోట్ రూపొందించి నేడు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో …
Read More »కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా
హుజురాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చిందని, కొంతమంది నేతలకు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన భేరసారాలు బయటకు పొక్కటంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయ్యింది. 24గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని… సరైన సమాధానం రాకపోతే పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించింది. గతంలోనే మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు …
Read More »బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం – మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తామని, ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణ
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Read More »తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడుతాం : మంత్రి కేటీఆర్
కృష్ణా జలాల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ …
Read More »మొక్కలు నాటిన హిమాన్షు
తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి తనయుడు హిమాన్షు.. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి హిమాన్షు.. ప్రగతి భవన్లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. …
Read More »దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్
దేశ రాజకీయాల్లో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ గారిని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు అన్నారు, PMGSY, జీవవైవిధ్య కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు చిట్యాల మండలంలోని నేరడ-ఎలికట్టె గ్రామ సరిహద్దుల్లో రోడ్డుకు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు, ఈ సందర్భంగా ఆయన ఇరు గ్రామాల ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. తొలుత నేరడ గ్రామంలోని ఎస్సి కాలనీ …
Read More »రేపే తెలంగాణ మంత్రి మండలి సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం అయింది.ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు చేస్తున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలతో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు కూడా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 32 …
Read More »నేడు టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొంటారు. ఈ నెల 16న ఎల్ రమణ తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద …
Read More »