మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహించనున్నారు. డబీర్పురాలోని బీబీకా ఆలం నుంచి చాదర్ఘాట్ వరకు ఊరేగింపు కొనసాగనుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read More »ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచింది తెలంగాణ
ఏడేళ్లలో అగ్రగామిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు..!!మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న ‘కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో చాలా అనుమానాలుండేవన్నారు. రాష్ట్రం వచ్చిన …
Read More »బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్
బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని.. జన్ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు వస్తాయంటూ సెటైర్ వేశారు.
Read More »దళితబంధు ఇప్పటిది కాదు..25ఏండ్ల క్రితం నాంది పలికా-సీఎం కేసీఆర్
దళితబంధు తమాషా అనుకోవద్దు. పెద్ద బాధ్యత అప్పగిస్తున్న. దళితబంధు ఈ రోజు పుట్టింది కాదు. 25 ఏండ్లుగా నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, 25 ఏండ్ల క్రితం దళిత చైతన్య జ్యోతికి శ్రీకారం చుట్టిన. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనాడే పాటలు రాసిండు. కొన్ని ప్రయత్నాలు చేశాం. ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి సంతకంతో దళితబిడ్డ, నా క్లాస్మేట్ దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశా. …
Read More »కొత్త బ్యాంకు ఖాతాల్లోనే దళితబంధు పైసలు
పాత అకౌంట్లో వేస్తే పాత బాకీల కింద పట్టుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి లక్ష కన్నా ఎక్కువ తీసుకోవద్దనే కేంద్రం పెట్టిన నిబంధన కూడా ఉన్నది. వాటన్నింటినీ అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకోవాలంటే మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. కొత్తబ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. కలెక్టర్లు మీకు త్వరలోనే కొత్త ఖాతాలు తెరిపిస్తరు. దీనికి తెలంగాణ దళితబంధు ఖాతా అని పేరు పెట్టుకుంటం. ఆ ఖాతాలోనే డబ్బులు …
Read More »దళితులు కాలరెగరేయాలి
తెలంగాణలో ఏడేండ్ల కిందట రైతుల ఆత్మహత్యలు.. ఆగమైపోయిన బతుకులు.. కరంటు రాదు.. మంచినీళ్లు రావు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు. ఇయ్యాల అవన్నీ ఉన్నయా? ఈ రోజు నా తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. పండిన పంటను గుంజలేక లారీలకు, మోయలేక హమాలీలకు దమ్మొస్తున్నది. రాష్ట్రం ఇంకా ప్రగతి సాధించాలె. కరువు కాటకాల్లేని, సస్యశ్యామల తెలంగాణ కావాలె. అదే పద్ధతిలో గతంలో అణిచివేతకు గురైన, తెలంగాణ రాష్ట్రంలో …
Read More »డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ వేదికపై దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి.. 15 మంది లబ్దిదారులకు చెక్కులను అందించనున్నారు. ఈ పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేలకు పైగా దళిత కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
Read More »మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్
హుజూరాబాద్లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటుంది. పిడికెలిత్తి అడుగుతది. దళిత బిడ్డలకు లాభం జరుగుతది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మీరు చాలా బాధ్యతగా హుజూరాబాద్లో విజయవంతం చేసి చూపి పెట్టాలె. …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
దళిత బంధు పథకం ప్రారంభోత్సవ వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ బొజ్జా దళితుడే. వాళ్ల నాన్న బొజ్జా తారకం.. ఉద్యమంలో పని చేసిన వారికి న్యాయవాదిగా ఉండే. గొప్ప న్యాయవాది. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే …
Read More »దళితబంధును విజయవంతం చేసే బాధ్యత దళిత యువతదే: సీఎం కేసీఆర్
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్ననే 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్కైనా వచ్చిందా? ఆ దిశగా …
Read More »