ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ …
Read More »మంత్రి కేటీఆర్ను కల్సిన డీఎంకే ఎంపీలు
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను డీఎంకే ఎంపీలు బుధవారం ఉదయం కలిశారు. నీట్పై సీఎం కేసీఆర్కు రాసిన లేఖను ఎంపీలు ఎల్ఎం గోవింద్, వీరస్వామి కలిసి కేటీఆర్కు అందజేశారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నామని డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల …
Read More »నవంబర్ 15న వరంగల్లో తెలంగాణ విజయ గర్జన తో భారీ బహిరంగ సభ
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్లో నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …
Read More »పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ…
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ వారి …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం
మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు …
Read More »రాయచూర్ ను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలి-BJP MLA డిమాండ్
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేశారు.సోమవారం రాయచూర్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని …
Read More »london లో ఘనంగా చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్స్లో మేయర్ బిష్ణు గురుగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …
Read More »అడ్డంగా దొరికిపోయిన ఈటల
అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ …
Read More »ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా మంత్రి KTR
ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్నారు మున్సిపల్, ఐటీశాఖా మంత్రి కేటీఆర్. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు వస్తున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు. వేడి పాలు ఒంటిపై పడి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు బోన్క్యాన్సర్తో బాధపడుతు న్న బాలుడి వైద్యానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్(11 నెలలు) …
Read More »రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు
దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.. తెలంగాణలో విద్యుత్ కోతలకు ఆస్కారమే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ ఉండదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను హైదరాబాద్కు …
Read More »