Home / Tag Archives: telanganacmo (page 227)

Tag Archives: telanganacmo

దేశానికే ఆదర్శం తెలంగాణ రైతు బంధు పథకం….

దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి….. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాలలో రైతు బందు డబ్బులు జమ చేస్తున్న సందర్బంగా సీఎం కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం …

Read More »

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో 2004లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. జహీరాబాద్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2016లో ఎమ్మెల్సీ  గా ఎన్నికయ్యారు.

Read More »

నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ -CM KCR

తెలంగాణలోని నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31న రూ.110 కోట్లతో చేపట్టే ఐటీ హబు శంకుస్థాపన చేస్తామన్న సీఎం కేసీఆర్ నగరంలో 2 ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు. రూ.36 కోట్లతో కొత్త డిగ్రీ కాలేజీ భవనం నిర్మించాలన్న సీఎం.. పట్టణాన్ని సుందరంగా మార్చాలన్నారు. కాగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ నిన్న బుధవారం  …

Read More »

అమూల్ సంస్థ రావడం గర్వకారణం -మంత్రి KTR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా బేకరీ తయారీ ప్లాంటును అమూల్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నిర్మాణానికి మొదటి దశలో రూ. 300 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న అమూల్.. రెండో దశలో మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు …

Read More »

తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.

Read More »

మిథాని- ఓవైసీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి KTR..

హైదరాబాద్ నగరంలోని ఓవైసీ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్‌ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌వే మార్గంగా మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 1.36 …

Read More »

మల్లన్నపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదైంది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పీఎస్ లో తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.

Read More »

అందుబాటులోకి హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.ఎస్ఆర్డీపీ లో భాగంగా ఒవైసీ-మిథాని జంక్షన్లో రూ.80కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ఉ.10.30లకు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ కంచన్ బాగ్ ని పిసల్బండ్ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ మీదగా ఎల్బీ నగర్ వరకు వెళుతుంది. దీంతో ఎస్ఆర్డీపీలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వంతెనల సంఖ్య 13, అండర్పస్ …

Read More »

నేటి నుండి రైతుబంధు సాయం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి …

Read More »

తెలంగాణ రైతాంగానికి మంత్రి సింగరెడ్డి విన్నపం

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలపుబాణాలు విసురుకొంటున్నాయని విమర్శించారు. విత్తనాలకోసం, ఇంటి అవసరాల కోసం మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే వారి వేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్కు భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat