Home / Tag Archives: telanganacmo (page 205)

Tag Archives: telanganacmo

బీసీలకు తెలంగాణ సర్కారు Good News

తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో బీసీలకు వయో పరిమితిలో 10ఏళ్ల సడలింపును వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కులాలతో పాటు వికలాంగులకు సంబంధిత రిజర్వేషన్లు, నియామకాలు, వయోపరిమితి, ఇతర ప్రయోజనాలను 2031 మే 31వ తేదీ వరకు అమలు చేసేలా ఆదేశాలిచ్చారు

Read More »

సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు

Read More »

‘తె‌లం‌గాణ హెల్త్‌ ప్రొఫైల్‌’ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి‌ష్ఠా‌త్మకంగా చేప‌ట్టిన మరో పథకం ‘తె‌లం‌గాణ హెల్త్‌ ప్రొఫైల్‌’ను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలం‌గాణే లక్ష్యంగా అడు‌గులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రం‌లోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమా‌చార నివే‌దిక (హెల్త్‌ ప్రొఫైల్‌) సిద్ధం చేయా‌లని నిర్ణయిం‌చింది. దీనికోసం పైలట్‌ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్‌లో …

Read More »

ఇంటర్ పాసైనవారికి తెలంగాణ సర్కారు శుభవార్త

కనీస మార్కులతో(35) ఇంటర్ పాసైనవారిని కూడా ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్ కు అర్హత లభిస్తుంది. కరోనాతో రెండేళ్లుగా సరిగ్గా క్లాసులు జరగక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 40 మార్కులు వస్తేనే ఎంసెట్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది.

Read More »

కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని న‌డ‌పాలి- సీఎం కేసీఆర్

దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భార‌త్‌ను స‌రైన దిశ‌లో తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్య‌మానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మ‌ద్ద‌తు ప‌లికారు. రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రించారు. ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ …

Read More »

ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి…..

ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 43 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆశా …

Read More »

రాంచీ చేరుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్

జార్ఖండ్ రాజ‌ధాని రాంచీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. మ‌రికాసేప‌ట్లో జార్ఖండ్ గిరిజ‌న ఉద్య‌మ‌కారుడు బిర్సాముండా విగ్ర‌హానికి పూల‌మాల వేసి సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం కేసీఆర్.. నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి వెళ్ల‌నున్నారు. గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక …

Read More »

తెలంగాణ రాష్ట్రానికి మరో పరిశ్రమ.. రూ.250 కోట్ల పెట్టుబడితో ఎస్‌3వీ కంపెనీ

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్‌3వీ వ్యాస్క్కులార్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. దీనిద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ‘రాష్ట్రంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 78 శాతం ఇతర దేశాల …

Read More »

సర్కార్‌ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలి

సర్కార్‌ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దవాఖానకి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలన్నారు. రెఫరల్ కేసులు తగ్గించాలని వైద్యులకు సూచించారు. పేదలకు వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో …

Read More »

ఇండోర్ స్టేడియం మరియు పలు అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఎమ్మెల్యే Kpకు వినతి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు, భూగర్భ డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్య, అండర్ గ్రౌండ్ మంచినీటి సంపు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat