అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్హెచ్ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్స్పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు.మధులత 2002 బ్యాచ్ కు …
Read More »Telangana Assembly Budget Meetings-బీజేపీ ఎమ్మెల్యేలపై వేటుకు అదే కారణమా..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖమంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో … మరోక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అయితే శాసనసభలో మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని …
Read More »మంత్రి సత్యవతి రాథోడ్ ను కల్సిన ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం
మహిళల గౌరవం కాపాడే విధంగా మరిన్ని చట్టాలను తీసుకురావాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం నేడు మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి విజ్ణప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి, కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, …
Read More »2 గంటల పాటు కొనసాగిన మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్రావు తన ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను హరీశ్రావు వివరంగా చదివి వినిపించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని …
Read More »రూ. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
2022-23 రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్ను మంత్రి ప్రవేశపెడుతున్నారు. రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను రూపొందించారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. …
Read More »అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కలిశారు. సీఎం వెంట మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్ను మంత్రి హరీశ్రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.
Read More »ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హారీష్ రావు ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హరీశ్రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ్నుంచి నేరుగా హరీశ్రావు అసెంబ్లీకి బయల్దేరనున్నారు.కోకాపేట్లోని తన నివాసం వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని …
Read More »నేటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు టీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో వారి మద్దతుదారులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Read More »పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్న YS Sharmila
ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.
Read More »